ఆ సినిమా షూట్ సమయంలో చరణ్ ను చూసి బాధ పడిన తల్లి... ఏం జరిగిందంటే?

టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్( Ram Charan ) కు ప్రేక్షకుల్లో ఏ స్థాయిలో క్రేజ్ ఉందో చెప్పాల్సిన అవసరం లేదు.

చిరుత సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి రామ్ చరణ్ పరిచయం కాగా తొలి సినిమాతోనే చరణ్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే.

ఈ సినిమాలో నేహాశర్మ హీరోయిన్ గా నటించగా స్టార్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్( Puri Jagannadh ) డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కింది.అయితే చిరుత మూవీ( Chirutha ) షూట్ బ్యాంకాక్ లో జరిగిందనే సంగతి తెలిసిందే.

అయితే చరణ్ పుట్టినరోజున సురేఖ, చిరంజీవి బ్యాంకాక్ కు కొడుకును చూడటానికి వెళ్లగా ఆ సమయంలో బ్యాంకాక్ లో చరణ్ ఫేస్ ట్యాన్ అయ్యి కనిపించాడు.చరణ్ ను అలా చూసిన వెంటనే సురేఖ ఎమోషనల్ కాగా తన కొడుకు కష్టపడుతున్నారని చిరంజీవి మాత్రం ఎంతో సంతోషించారట.చిరుత సినిమా తర్వాత చరణ్ మగధీర సినిమా( Magadheera )లో నటించి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్నారు.

వాస్తవానికి చరణ్ తొలి సినిమా రాజమౌళి డైరెక్షన్ లోనే తెరకెక్కాల్సి ఉన్నా జక్కన్న చరణ్ సెకండ్ మూవీకి డైరెక్షన్ చేస్తానని చెప్పడంతో చిరంజీవి సైతం అందుకు అంగీకరించాల్సి వచ్చింది.రామ్ చరణ్ ఒక్కో సినిమాకు కెరీర్ పరంగా ఎదుగుతూ రెమ్యునరేషన్ పరంగా కూడా టాప్ లో ఉన్నారు.ఉపాసనతో పెళ్లి తర్వాత చరణ్ కు మరింత క్రేజ్ పెరగడం కొసమెరుపు.

Advertisement

రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమా( Game Changer )లో నటిస్తుండగా ఈ సినిమా బాక్సాఫీస్ ను షేక్ చేస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు.చరణ్ గేమ్ ఛేంజర్ నెక్స్ట్ లెవెల్ కాన్సెప్ట్ తో తెరకెక్కుతుండటం గమనార్హం.

చరణ్ ఈ సినిమాలో ఐఏఎస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారని సమాచారం అందుతోంది.రామ్ చరణ్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య మైండ్ బ్లాంక్ అయ్యే స్థాయిలో పెరుగుతోంది.

Advertisement

తాజా వార్తలు