తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వైసీపీ నేతల క్యూ..!!

తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి వైసీపీ నేతలు క్యూ కడుతున్నారు.ఈ మేరకు కీలక నేత ఆమంచి కృష్ణ మోహన్ సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లారు.

ఇటీవల ఆమంచికి వైసీపీ అధిష్టానం పర్చూరు బాధ్యతలు అప్పగించిన సంగతి తెలిసిందే.అయితే పర్చూరు బాధ్యతలపై అసంతృప్తితో ఉన్న ఆమంచి సొంత నియోజకవర్గం చీరాల స్థానాన్ని కోరుతున్నారు.

ఈ నేపథ్యంలో సజ్జల రామకృష్ణారెడ్డిని ఆమంచి కృష్ణమోహన్ కలిసి.సీటు వ్యవహారంపై చర్చించారని తెలుస్తోంది.

దీనిలో భాగంగానే చీరాల బాధ్యతలు అప్పగించాలని ఆమంచి కోరారని సమాచారం.అదేవిధంగా నల్లపురెడ్డి, సింహాద్రి రమేశ్ బాబు సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లారని సమాచారం.

Advertisement
మళ్లీ జగనే సీఎం సంబరాలకు సిద్ధం కండి అంటున్న వైసీపీ..!!

తాజా వార్తలు