Praneeta Rao: ఫోన్ ట్యాపింగ్ కేసులో రెండో రోజు కస్టడీకి ప్రణీత్ రావు..!!

ఫోన్ ట్యాపింగ్ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.

ఇందులో భాగంగా ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావును( DSP Praneet Rao ) రెండో రోజు కస్టడీలోకి తీసుకోనున్నారు.

నిన్న ప్రణీత్ రావును కస్టడీలోకి తీసుకున్న పోలీసులు రహస్య ప్రాంతంలో విచారించారు.అదేవిధంగా నిన్న ఎస్ఐబీ ( SIB )కార్యాలయానికి ప్రణీత్ రావును పోలీసులు తీసుకెళ్లారు.

అనంతరం ధ్వంసం చేసిన హార్డ్ డిస్కులు, రికార్డుల మాయంపై సీన్ రీకన్‎స్ట్రక్షన్ చేశారని తెలుస్తోంది.ఈ క్రమంలోనే 47 హార్డ్ డిస్కులను కొత్త వాటితో రీప్లేస్ చేసినట్లు ఒప్పుకున్న ప్రణీత్ రావు అన్ని రాజకీయ పార్టీల నేతల ఫోన్లను కూడా టాపింగ్ చేసినట్లు అంగీకరించారు.

ఈ నేపథ్యంలో ప్రణీత్ రావు చెప్పిన వాటిపై ఆధారాలు సేకరిస్తున్నామని పోలీసులు తెలిపారు.

Advertisement
మాజీ మంత్రి మల్లారెడ్డి సంచలన వ్యాఖ్యలు

తాజా వార్తలు