ప్రజాశాంతి పార్టీలోకి ప్రజా గాయకుడు గద్దర్..

ప్రజా యుద్ధ నౌకగా తెలంగాణలో పేరు గడించిన గద్దర్ ప్రజాశాంతి పార్టీలో చేరారు.ఆ పార్టీ అధినేత కేఏ పాల్ సమక్షంలో పార్టీ తీర్థం పుచ్చుకున్నారు.

ఈ నేపథ్యంలో మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఉపఎన్నికలో ప్రజాశాంతి పార్టీ అభ్యర్థిగా గద్దర్ బరిలోకి దిగనున్నారు.దీనిలో భాగంగా రేపటి నుంచి మునుగోడులో ఇంటింటి ప్రచారం చేస్తానని గద్దర్ తెలిపారు.

మ‌రోవైపు ఈ నెల 2న శాంతి సమావేశానికి పోలీసులు అనుమ‌తి నిరాకరించడాన్ని నిరసిస్తూ చేస్తున్న ఆమరణ దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో పార్టీ కండువా కప్పుకున్న అనంతరం గ‌ద్ద‌ర్.

కేఏ పాల్ కు నిమ్మ‌స‌రం ఇచ్చి దీక్ష విర‌మింపజేశారు.

Advertisement
సోమవారం రోజు ఈ మంత్రాలను పఠించడం వల్ల.. నయం కానీ రోగాల తో పాటు ఇంకెన్నో సమస్యలు దూరం..!

తాజా వార్తలు