ఇండియన్స్‌ పరువు తీసిన ప్రభుకి అమెరికాలో 9 ఏళ్ల జైలు శిక్ష.. ఎవరీ ప్రభు? ఏంటీ అతడి కథ?

ఆడవారి పట్ల ఇండియన్స్‌ చాలా గౌరవంగా వ్యవహరిస్తారు అనేది ప్రపంచ దేశాల అభిప్రాయం.

ఏ ఇతర ప్రపంచ దేశాల్లో కూడా ఇండియాకు ప్రత్యేకమైన గుర్తింపు, గౌరవం ఉండదు.

కాని ఇండియాలో మాత్రమే ఉమెన్స్‌కు అత్యధిక ఆధరణ ఉంటుందని, ఆడవారిని పరాశక్తులుగా పూజిస్తామని తెలిసిన విషయమే.అందుకే ఇండియన్స్‌ను ఇతర దేశాలకు చెందిన వారు అభిమానిస్తారు, ఆరాధిస్తారు.

అలాంటి ఇండియా పరువు తీసేలా తమిళనాడుకు చెందిన ప్రభు రామమూర్తి వ్యవహరించాడు.

ఈయన 2015వ సంవత్సరంలో ఇండియా నుండి అమెరికా వెళ్తున్నాడు.ఆ సమయంలో తన పక్కన ఉన్న ఒక ప్రయాణికురాలితో అసభ్యంగా ప్రవర్తించాడు.ఆమె నిద్రిస్తున్న సమయంలో ఆమెతో అనుచితంగా ప్రవర్తించాడు.

Advertisement

ఆమె విమానం దిగే వరకు ఏదో ఒకరకంగా ఇబ్బంది పెడుతూనే ఉన్నాడు.అన్ని విషయాలను ఓపికగా భరించిన ఆమె విమానం ల్యాండ్‌ అయిన తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసింది.

అత్యంత దారుణమైన పరిస్థితి తాను ఎదుర్కోన్నాను అంటూ అమెరికా కోర్టులో ఆమె విన్నవించుకోవడం జరిగింది.

గత కొంత కాలంగా ఈ కేసు అమెరికన్‌ కోర్టులో విచారణ జరుపుతూనే ఉన్నారు.ఎట్టకేలకు ఈ కేసు విచారణ పూర్తి అయ్యింది.నిందితుడు ప్రభు రామమూర్తి తప్పు చేసినట్లుగా కోర్టు నిర్ణారణకు వచ్చింది.

కోర్టు తీర్పు ఇచ్చింది.ప్రభును 11 సంవత్సరాల కారాగార శిక్షతో అక్కడి జైలు శిక్షించింది.

Betway: Practical Guide To Player Safety And Responsible Gambling

ఇండియన్స్‌ పరువు తీసినందుకు సరైన శిక్షే పడినది అంటూ కొందరు సంతోషం వ్యక్తం చేస్తుంటే మరి కొందరు మాత్రం ఇది మరీ దారుణం, ఆయన చేసిన తప్పుకు 11 ఏళ్ల జైలు ఏంటీ అంటున్నారు.అతడి కుటుంబ సభ్యులు కూడా ఆయన అంటూ పరమ చిరాకు చూపుతున్నారు.జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత కూడా ఆయన్ను పట్టించుకోం అంటూ ప్రభు కుటుంబ సభ్యులు అంటున్నారు.

Advertisement