ప్రభాస్ 'ఆదిపురుష్'పై లేటెస్ట్ ఇంట్రెస్టింగ్ అప్డేట్!

ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్.ఈయన సినిమాలు అన్ని కూడా 100 కోట్ల బడ్జెట్ పైమాటే అని చెప్పాలి.

ప్రభాస్ చేతిలో ఇప్పటికే నాలుగైదు సినిమాలు ఉన్నాయి.ఇటీవలే రాధేశ్యామ్ సినిమాతో వచ్చి ప్రేక్షకులను నిరాశ పరిచాడు.అసలు డార్లింగ్ ఇలాంటి సినిమా ఎలా ఒప్పుకున్నాడు అనే సందేహం ఆయన ఫ్యాన్ కు సైతం కలిగింది.

దీంతో ఈయన తర్వాత సినిమా అప్డేట్ కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో ఆదిపురుష్ ఒకటి.ప్రెసెంట్ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపు కుంటున్న రెండేళ్ల క్రితమే ఈ సినిమా ముంబై లో ప్రత్యేకమైన సెట్స్ లో తెరకెక్కించారు.

ఈ సినిమాలో ప్రభాస్ రాముడు పాత్రలో కనిపించ నున్నాడు.ఈ పాత్ర కోసం డార్లింగ్ చాలా కష్టపడ్డాడు అని.వి షేప్ బాడీ కోసం చాలా చెమటలు చిందించాడు అని ఆయన కష్టం అంతా తెరమీద కనిపిస్తుంది అని ఓం రౌత్ చెప్పుకొచ్చాడు.ఈ సినిమా 2023 సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది.

ఇది 3డీ వెర్షన్ కావడంతో అభిమానవులంతా సంతోషంగా ఉన్నారు.ఈ సినిమాలో ప్రభాస్ కు జోడీగా జానకి పాత్రలో కృతి సనన్ నటిస్తుంది.

లంకేశ్వరుడు రావణాసురిడిగా సైఫ్ అలీ ఖాన్ నటిస్తుండగా.లక్ష్మణ్ గా సన్నీ సింగ్ నటిస్తున్నాడు.

ఈ సినిమాను టి సిరీస్ సంస్థ 500 కోట్ల ఖర్చు చేసినట్టు టాక్.

అయితే తాజాగా ఈ సినిమా నుండి మరిన్ని విషయాలు బయటకు వచ్చాయి.ఈ సినిమా ప్రొమోషన్స్ కోసం రెడీ అవుతుంది అని తెలుస్తుంది.ఈ సినిమా ప్రొమోషన్స్ చేయడం లేదని గత కొన్ని రోజులుగా ఫ్యాన్స్ కూడా గుర్రుగా ఉన్నారు.

ఇక ఈ విషయంపై ఇప్పుడు క్లారిటీ వచ్చింది.వచ్చే అక్టోబర్ నుండి మేకర్స్ ఈ సినిమా ప్రొమోషన్స్ స్టార్ట్ చేసే ప్లాన్ లో ఉన్నారట.

మహేష్ తో మల్టీస్టారర్ పై కార్తీ ఆసక్తికర వ్యాఖ్యలు.. మేమిద్దరం క్లాస్ మేట్స్ అంటూ?
మొటిమ‌ల‌ను సులువుగా నివారించే జామాకులు..ఎలాగంటే?

అప్పటి నుండి రిలీజ్ అయ్యే వరకు ఈ సినిమా నుండి వరుస అప్డేట్ లు ఇస్తూ ఉంటారట.మరి ఈ తరుణం కోసమే అభిమానులు ఎదురు చూస్తున్నారు.

తాజా వార్తలు