నరసరావుపేట ఎంపీ స్థానంలో వెల్లువెత్తిన పోలింగ్.. ఏపీ సీఈవో గణంకాలు

ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి( AP CEO ) కార్యాలయం కీలక విషయాన్ని తెలిపింది.పల్నాడు జిల్లా నరసరావుపేట లోక్ సభ స్థానంలో( Narasaraopeta Parliament ) పోలింగ్ శాతం భారీగా నమోదు అయిందని తెలిపింది.

ఈ నెల 13న జరిగిన ఎన్నికల్లో నరసరావుపేట ఎంపీ స్థానం పరిధిలో సుమారు 85.65 శాతం పోలింగ్ నమోదైందని సీఈవో కార్యాలయం పేర్కొంది.1967 వ సంవత్సరం నుంచి ఇప్పటివరకు మొత్తం 15 సార్లు ఎన్నికలు జరగగా.ఈ సారే అత్యధికంగా పోలింగ్ శాతం వచ్చిందని తెలిపింది.

నరసరావుపేట లోక్ సభ స్థానం పరిధిలో మొత్తం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి.అలాగే ఎంపీ నియోజకవర్గ పరిధిలో( MP Constituency ) మొత్తం 17,34,858 మంది ఓటర్లు ఉండగా.

వీరిలో 14,85,909 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపింది.

వర్షాకాలంలో వేధించే జలుబు, దగ్గును కేవలం 2 రోజుల్లో తరిమికొట్టే పవర్ ఫుల్ డ్రింక్ మీ కోసం!
Advertisement

తాజా వార్తలు