భూ గ్రహంపై ఎన్నో ఉత్పాతాలకూ గ్రహ శకలాలు కారణం అయ్యాయి.కొన్ని సంవత్సరాల క్రితం 90 శాతం జీవాన్ని తుడిచి పెట్టేంది ఓ ఆస్టరాయిడ్.
అంతరిక్షంలో ఉండే ఆస్టరాయిడ్లు అప్పుడప్పుడూ భూమికి అత్యంత సమీపంగా దూసుకెళ్తుంటాయి.ఈ క్రమంలోనే తాజాగా ఐదు రోజుల వ్యవధిలో ఏకంగా నాలుగు గ్రహ శకలాలు భూమి సమీపం నుంచి దూసుకెళ్లనున్నట్లు నాసా శాస్త్రవేత్తలు ప్రకటించారు.
నార్మల్ గా చిన్న శకలాలు అయితే భూ వాతావరణంలోకి ప్రవేశించినా మధ్యలోనే మండిపోతాయి.పెద్ద గ్రహ శకలాలు పూర్తిగా మండిపోక ముందే దిగువదాకా దూసుకొచ్చి భూమిని ఢీకొన్నప్పుడు భారీ నష్టాన్ని కలిగిస్తుంటాయి.‘2015 ఎఫ్ఎఫ్’గా పిలిచే ఆస్టరాయిడ్ ఆగస్ట్ 12న భూమికి సమీపంగా వెళ్లనుంది.53 అడుగుల ఉన్న ఈ ఆస్టరాయిడ్ తో పెద్దగా ప్రమాదం లేదని నాసా తెలిపింది.భారత కాలమానం ప్రకారం ఆగస్టు 14న తెల్లవారుజామున 3.23 గంటల సమయంలో ‘2022 ఓటీ1’గా పిలిచే ఆస్టరాయిడ్ భూమికి సమీపంగా వెళ్లనుంది.110 అడుగుల పరిమాణమున్న ఈ గ్రహ శకలం భూమికి 47 లక్షల కిలోమీటర్ల దూరం నుంచి ఏకంగా గంటకు 20,520 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తుందని నాసా తెలిపింది.ఆగస్టు 14న మధ్యాహ్నం 71 అడుగుల పరిమాణం ఉన్న ‘2022 ఓఏ4’ ఆస్టరాయిడ్ భూమికి సమీపంగా దూసుకుపోనుందని నాసా వెల్లడించింది.
ఆగస్టు 16న 93 అడుగుల వెడల్పున్న ‘2022 పీడబ్ల్యూ’ ఆస్టరాయిడ్ భూమికి పక్కగా ప్రయాణించనుందని నాసా ప్రకటించింది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy