నయవంచనకు చంద్రబాబు మారుపేరు అంటూ పేర్ని నాని సీరియస్ వ్యాఖ్యలు..!!

ఏపీ రాజకీయాలు వాలంటీర్ వ్యవస్థ( Volunteers ) చుట్టూ తిరుగుతున్నాయి.ఇటీవల పెన్షన్ పంపిణి చేయకూడదని  వాలంటీర్లని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేయడం తెలిసిందే.

ఈ విషయంపై టీడీపీ వర్సెస్ వైసీపీ నాయకుల మధ్య మాటల తూటాలు గట్టిగా పేలాయి.చంద్రబాబు వాలంటీర్లను అడ్డుకోవటం వల్ల పెన్షన్ పంపిణీ ఆగిపోయిందని వైసీపీ నేతలు ఆరోపణలు చేశారు.

అయితే తాను వాలంటరీ వ్యవస్థకు వ్యతిరేకం కాదని చంద్రబాబు పేర్కొన్నారు.ఉగాది పండుగ నాడు తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లకు నెలకు పదివేల రూపాయల జీతం ఇస్తామని సంచలన ప్రకటన చేశారు.

ఈ ప్రకటనపై పేర్ని నాని( Perni Nani ) స్పందించారు.చంద్రబాబు వాగ్దానాలను ఎవరు నమ్మరు.

Advertisement

నయవంచనకు చంద్రబాబు మారుపేరు.

అసలు వాలంటీర్ల వ్యవస్ధే అనవసరం అని వ్యాఖ్యలు చేసిన ఆయన.ఇప్పుడు వారిపై ప్రేమను ఒలకబోస్తున్నారు.వాలంటీర్ల సేవలు ఆగిపోయేలా చేసింది ఎవరో ప్రజలకు తెలుసు.

అంటూ పేర్ని నాని సీరియస్ వ్యాఖ్యలు చేయడం జరిగింది.చంద్రబాబు కుటీల వాగ్దానాలను ఎవరు నమ్మరు.

ప్రజల్లో తిరుగుబాటు రావడంతోనే చంద్రబాబు యూటర్న్ తీసుకున్నారు.సేవ కోసం పని చేసే వాలంటీర్లు.

Marathon: Atención Al Cliente Y Calidad Del Servicio — Guía Práctica Para Jugadores De Arg...
Hair care home remedy : ఈ రెమెడీని పాటిస్తే జుట్టు ఎంత పల్చగా ఉన్నా సరే నెల రోజుల్లో ఒత్తుగా మారుతుంది!

చంద్రబాబు గాలానికి పడరు.బూటకపు మాటలు.

Advertisement

నయవంచనకు ప్రతిరూపం చంద్రబాబు అని విమర్శలు గుప్పించారు.ప్రజలకు గాలం వేయటం వారిని వాడుకుని వదిలేయడం.

అయిపోయింది.ఇప్పుడు కొత్తగా వాలంటీర్లకు 10,000 జీతం పెంచుతామని.

ఎర వేస్తున్నారు.ప్రభుత్వ సేవలను నేరుగా పేద.మధ్యతరగతి వర్గాలకు వాలంటీర్ల ద్వారా అందించడంతో సీఎం జగన్ ( CM Jagan )ప్రభుత్వం పై ప్రజలందరికీ నమ్మకం ఏర్పడిందని పేర్ని నాని స్పష్టం చేశారు.