రెండో విడత కంటి వెలుగును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి

రెండో విడత కంటి వెలుగును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి జిల్లా ప్రజా పరిషత్ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణరాఘవరెడ్డి రాజన్న సిరిసిల్ల జిల్లా: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు ను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని జడ్పీ చైర్ పర్సన్ న్యాలకొండ అరుణ రాఘవ రెడ్డి కోరారు.

సోమవారం కొనరావుపెట్ మండలం గొల్లపల్లి,కోలనూర్ గ్రామంలో కంటి వెలుగు పరీక్ష శిబిరాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా చైర్ పర్సన్ మాట్లాడుతూ అందరహిత సమాజం నిర్మాణం కోసమే ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు కంటి వెలుగు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారన్నారు.ప్రతి ఒక్కరికి కంటి పరీక్షలను ప్రముఖ వైద్యుల పర్యవేక్షణలో, నిర్వహించి వారికి మందులను కళ్ల అద్దాలను అందజేస్తున్నామన్నారు.

ప్రజలు ఎవరు కూడా కంటి సమస్యలతో బాధపడవద్దనే ముఖ్య లక్ష్యంతో కంటి పరీక్షలు నిర్వహించి అద్దాలతో పాటు మందులు ఉచితంగా పంపిణీ చేస్తున్నారని, అవసరమైన వారికి కంటి ఆపరేషన్ సైతం చేయించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.ప్రజలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో గొల్లపల్లి,కోలనూర్, సర్పంచ్ బొజ్జం వసంత మల్లేష్, పాక్స్ చైర్మన్ బండ నర్సయ్య, సర్పంచులు సురేష్, ఎంపీవో రాజు, ఎంపిటిసి ప్రవీణ్, ఉప సర్పంచ్ లావణ్యనరేందర్ రావు, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement
పవన్ కళ్యాణ్ రాజకీయాలలో చరిత్ర సృష్టించారు.. ఎమోషనల్ కామెంట్స్ చేసిన పరుచూరి!

తాజా వార్తలు