జనవాణి కార్యక్రమంలో వైసీపీ ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ సీరియస్ వ్యాఖ్యలు..!!

విజయవాడలో పవన్ కళ్యాణ్ అధ్యక్షతన జనసేన పార్టీ "జనవాణి" కార్యక్రమం నిర్వహిస్తుంది.ఈ కార్యక్రమంలో ప్రజా సమస్యలకు సంబంధించి అర్జీలు పవన్ తీసుకుంటున్నారు.

ఈ క్రమంలో వైసీపీ ప్రభుత్వం వచ్చాక దళితులను ఇంకా మైనారిటీల వర్గాలకి అన్యాయం చేయడం జరిగిందని తెలిపారు.వైసీపీని బలంగా నమ్మే వర్గాలకు ఈ రీతిలో అన్యాయం చేయటం దారుణమని, ఏకంగా ఎస్సీ ఎస్టీ సబ్ ప్లాన్ కి సంబంధించి కొన్ని పథకాలు వైసీపీ ఆపేయడం జరిగిందని పవన్ ఆరోపించారు.

ఇక మైనార్టీ విద్యార్థులు విదేశాల్లో చదువుకునే అవకాశాలు లేకుండా దుల్హన్ పథకం ఆపేయడం జరిగిందని తెలిపారు.ఇదే కార్యక్రమంలో మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి సభ్యులు పవన్ కళ్యాణ్ నీ కలిసి తమ సమస్యలు విన్నవించుకున్నారు.

ఈ సందర్భంగా మైనారిటీలను జనసేన పార్టీ ఓటు బ్యాంకుగా చూడదని.రంజాన్ సమయంలో విందులు ఇచ్చి తర్వాత వదిలేయడం అటువంటివి చేయబోమని పవన్ స్పష్టం చేశారు.

Advertisement

మైనార్టీలకు జనసేన పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.

Taxation Of Winnings — How Canadian Players Should Treat Casino And Blackjack Payouts At C Bet
Advertisement