MLA Palla Rajeshwar Reddy : పిరికిపందలు మాత్రమే పార్టీ మారుతారు..: ఎమ్మెల్యే పల్లా

జనగామ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి( MLA Palla Rajeshwar Reddy ) మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు.

బీఆర్ఎస్ లో ( BRS ) గెలిచి ఇతర పార్టీల్లోకి వెళ్లిన వారిని వదిలి పెట్టబోమన్నారు.

ఒకవేళ పార్టీ మారాలనుకుంటే తమ పదవులకు రాజీనామా చేసి వెళ్లాలని తెలిపారు.పిరికిపందలు మాత్రమే పార్టీ మారుతారని పేర్కొన్నారు.

స్వలాభం చూసుకుని పార్టీలు మారడం దారుణమన్నారు.కాంగ్రెస్,( Congress ) బీజేపీలకు( BJP ) ఎంపీ అభ్యర్థులే లేరన్న ఆయన తమ పార్టీ నేతలను చేర్చుకొని టికెట్స్ ఇస్తున్నారని విమర్శించారు.

అక్రమాలు చేసిన నేతలు భయంతో పార్టీ మారుతున్నారన్న పల్లా రాజేశ్వర్ రెడ్డి అలాంటి వారి అవినీతిని తామే బయటపెడతామని హెచ్చరించారు.

Advertisement
God Of Coins Player Safety And Responsible Gambling (UK)