పంజాబ్ సరిహద్దుల్లో మరోసారి డ్రగ్స్ కలకలం

పంజాబ్ సరిహద్దుల్లో మరోసారి డ్రగ్స్ కలకలం సృష్టించాయి.పాకిస్థాన్ నుంచి డ్రగ్స్ ను అక్రమంగా తరలిస్తుండగా బీఎస్ఎఫ్ దళాలు అడ్డుకున్నాయి.

ఈ క్రమంలోనే ఫిరోజ్ పూర్ సెక్టార్ లో డ్రగ్స్ ప్యాకెట్లను బీఎస్ఎఫ్ దళాలు స్వాధీనం చేసుకున్నాయి.అయితే అర్ధరాత్రి సమయంలో సేతావాల గ్రామంలో డ్రోన్ ఈ డ్రగ్స్ ప్యాకెట్లను జారవిడిచినట్లు అధికారులు నిర్ధారించారు.

ఈ క్రమంలో మూడు హెరాయిన్ ప్యాకెట్లు, రెండు మెరిసే బంతులు, బ్యాటరీతో కూడిన నీలి రంగు ఎల్ఈడీ బల్బును బీఎస్ఎఫ్ దళాలు స్వాధీనం చేసుకుంది.కాగా మూడు హెరాయిన్ ప్యాకెట్ల బరువు సుమారు రెండున్నర కిలోలుగా గుర్తించారు.

కడపను టార్గెట్ చేసిన టీడీపీ .. అలెర్ట్ అవుతున్న జగన్
Advertisement

తాజా వార్తలు