మరోసారి జనంలోకి జగన్.. కొత్త షెడ్యూల్ విడుదల..!!

2024 ఎన్నికలను వైసీపీ అధినేత జగన్ ( YCP chief Jagan ) చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం తెలిసిందే.

ఈ క్రమంలో ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో.

ప్రచారం విషయంలో స్పీడ్ పెంచారు.మొదట నాలుగు ప్రాంతాలలో "సిద్ధం" సభలు నిర్వహించారు.

ఆ తర్వాత మార్చి నెలాఖరున "మేమంతా సిద్ధం" పేరిట బస్సు యాత్ర నిర్వహించడం జరిగింది.ఏప్రిల్ 24 వరకు బస్సు యాత్ర సాగింది.

ఇడుపులపాయ నుంచి ఇచ్చాపురం వరకు.సాగిన ఈ బస్సు యాత్ర వైసీపీ క్యాడర్( YCP cader ) లో జోష్ నింపింది.

Advertisement

బస్సు యాత్ర ముగించుకున్న అనంతరం ఏప్రిల్ 25వ తారీకు.పులివెందులలో సీఎం జగన్ నామినేషన్ వేశారు.

ఇదిలా ఉంటే ఇప్పుడు మళ్లీ విడత ప్రచారానికి జగన్ సిద్ధమయ్యారు.ఆల్రెడీ షెడ్యూల్ కూడా ఖరారు చేయడం జరిగింది.విషయంలోకి వెళ్తే ఈనెల 28 నుంచి రాష్ట్రవ్యాప్తంగా పర్యటన చేయనున్నారు.

ప్రతిరోజు మూడు అసెంబ్లీ నియోజకవర్గాలలో( assembly constituencies ) బహిరంగ సభలు నిర్వహించనున్నారు.ఈనెల 28న ఉమ్మడి అనంతపురం జిల్లా తాడిపత్రి, నెల్లూరు జిల్లా వెంకటగిరి, కందుకూరులో బహిరంగ సభలు నిర్వహించనున్నారు.

ఈనెల 29న చోడవరం, పి.గన్నవరం, పొన్నూరులోనూ .సభలు నిర్వహించనున్నారు.ఆ తర్వాత 30వ తారీఖున కొండపి, మైదుకూరు, పిల్లేరులో సభలు జరగనున్నాయి.

ఈటెల ఆ పదవి కన్నేశారా ? అసంతృప్తితో రగిలిపోతున్నారా ?
చంద్రబాబు ఢిల్లీ టూర్ ... చర్చించేది ఇవేనా ? 

మే 1వ తారీకు బొబ్బిలి, పాయకరావుపేట, ఏలూరులో బహిరంగ సభలు నిర్వహించనున్నారు.ఈ మేరకు పార్టీ క్యాడర్ రూట్ మ్యాప్ తయారు చేయడం జరిగింది.

Advertisement

తాజా వార్తలు