'RRR' సెట్ లో 'కొమరం భీం' ఎంట్రీ కూడా కన్ఫర్మ్ అయ్యింది !

టాలీవుడ్ లో ప్రస్తుతం బిగ్గెస్ట్ మల్టీ స్టారర్ ఆర్ఆర్ఆర్ మూవీను దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు.

బాహుబలి సినిమా తర్వాత రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా పై ప్రేక్షకులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.

ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందా అని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న అభిమానులు ఎదురు చూస్తున్నారు.

ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ హీరోలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తుంటే రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్నాడు.

బాలీవుడ్ హీరో అజయ్ దేవగన్ కూడా కీలక పాత్రలో నటిస్తున్నాడు.ఈ సినిమాలో ఎన్టీఆర్ సరసన ఒక విదేశీ భామ నటిస్తుంటే రామ్ చరణ్ కు జోడీగాఆలియా భట్నటిస్తుంది.

Advertisement

పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాను డివివి దానయ్య 450 కోట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్నాడు.మొన్నటి వరకు కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్ ఆగిపోయింది.తెలంగాణాలో పరిస్థితులు చక్కబడడంతో లాక్ డౌన్ ఎత్తివేశారు.

దీంతో మళ్ళీ ఇప్పుడిప్పుడే షూటింగ్స్ స్టార్ట్ చేస్తున్నారు.రాజమౌళి కూడా ఆర్ ఆర్ ఆర్ సినిమా షూటింగ్ ను నిన్న స్టార్ట్ చేసాడు.

షూటింగ్ మొదలు పెట్టిన ఆర్ఆర్ఆర్ సెట్ లో నిన్ననే రామ్ చరణ్ అడుగు పెట్టాడు.అయితే ఇప్పుడు తారక్ కూడా సెట్ లో అడుగు పెట్టబోతున్నాడని తెలుస్తుంది.రెండు మూడు రోజుల్లో తారక్ షూటింగ్ లో జాయిన్ కాబోతున్నాడట.

వీరిద్దరి మధ్య కీల సన్నివేశాలతో పాటు, ఒక సాంగ్ ను కూడా షూట్ చేయబోతున్నట్టు టాక్. చివరి షెడ్యూల్ తొందరగా పూర్తి చేసి అనుకున్న సమయానికి విడుదల చేయాలనీ మేకర్స్ అనుకుంటున్నారట.

ఇదేందయ్యా ఇది.. బాయ్‌ఫ్రెండ్‌పై కోపంతో ఇలా కూడా చేస్తారా..??
అందివచ్చిన అవకాశాన్ని ఈ ఇద్దరు హీరోయిన్స్ ఉపయోగించుకుంటారా ?

చూడాలి మరి ఈ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో.

Advertisement

తాజా వార్తలు