పవన్, రిషబ్ మధ్య ఉన్నటువంటి ఈ కామన్ పాయింట్ గమనించారా?

తెలుగు సినిమా ఇండస్ట్రీలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు ఉన్నటువంటి క్రేజ్ ఏంటో మనకు తెలిసింది.

ఇలా ఈయన సినీ కెరియర్లో చేసినది చాలా తక్కువ సినిమాలు అయినప్పటికీ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్నారో.

పవన్ కళ్యాణ్ సినిమా అంటే సినిమా ఫ్లాప్ టాక్ సొంతం చేసుకున్న నిర్మాతలు నష్టపోయిన దాఖలాలు లేవు.ఇలా పవన్ క్రేజ్ భారీగానే ఉందని చెప్పాలి.

ఇకపోతే కన్నడ చిత్రపరిశ్రమలో దర్శకుడిగా హీరోగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నటుడు రిషబ్ శెట్టి గురించి కూడా అందరికీ సుపరిచితమే.

గత ఏడాది కన్నడ చిత్ర పరిశ్రమలో తెరికెక్కిన కాంతార సినిమా ద్వారా ఈయన ఒక్కసారిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.ఇక ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో రిషబ్ శెట్టి పేరు పాన్ ఇండియా స్థాయిలో మారుమోగిపోయింది.ఇలా పాన్ ఇండియా స్టార్ గా పేరు సంపాదించుకున్న రిషబ్ శెట్టి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మధ్య ఓ కామన్ పాయింట్ ఉంది.

Advertisement

ఇక వీరిద్దరి మధ్య ఉన్నటువంటి ఈ కామన్ పాయింట్ ఏంటి అనే విషయానికి వస్తే చాలామంది హీరోలు ప్రస్తుత కాలంలో ఇండస్ట్రీలో హీరోలుగా మంచి సక్సెస్ సాధించి అనంతరం నిర్మాతలుగా సినిమాలు నిర్మిస్తున్న విషయం మనకు తెలిసిందే.

ఇలా ఇండస్ట్రీలో హీరోలుగా సక్సెస్ అయిన వారు నిర్మాతలుగా ఉన్నారు తప్ప చాలా తక్కువ మంది మాత్రమే దర్శకులుగా మారారు.ఈ క్రమంలోనే నటుడు రీషబ్ శెట్టి పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఒకవైపు హీరోలుగా చేస్తూనే మరోవైపు దర్శకులుగా మెగా ఫోన్ పట్టుకున్నారు.ఇక పవన్ కళ్యాణ్ జానీ సినిమాకు ఆయనే దర్శకుడిగా వ్యవహరించారు.

అయితే ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాకపోయినప్పటికీ దర్శకుడిగా పవన్ తన టాలెంట్ ఏంటో నిరూపించుకున్నారు.ఇక కెరియర్ మొదట్లో దర్శకుడుగా స్థిరపడిన రిషబ్ శెట్టి అనంతరం హీరోగా కూడా నటించారు.

ఇలా హీరోలుగా నటిస్తూ దర్శకులుగా వీరిద్దరూ పేరు సంపాదించుకున్నారు.ఇక వీరితో పాటు హీరోలుగా నటిస్తూ దర్శకులుగా మారినటువంటి వారిలో అడివి శేష్, విశ్వక్ సేన్ వంటి హీరోలు కూడా ఉన్నారని చెప్పాలి.

కోటి ఆశలతో స్వదేశానికి బయలుదేరిన ఎన్నారై మహిళ... అంతలోనే విషాదం..?
Advertisement

తాజా వార్తలు