పీవోకేలో ఒక్క కుటుంబానికి కూడా నష్టం జరగనీయం: రాజ్ నాథ్ సింగ్

పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ విషయంలో భారత్- పాక్ యుద్ధ సమయంలోనే నిర్ణయం తీసుకొని ఉండాల్సిందని కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ అన్నారు.

ఆ యుద్ధం చరిత్రలో నిలిచిపోయిందన్న ఆయన.

ఆస్తుల కోసమో, అధికారం కోసమో జరిగిన యుద్ధం కాదని తెలిపారు.మానవత్వం కోసం పోరాడమన్నారు.

మానవత్వం కోణంలో భారత్ ఏ దేశంపై దాడులు చేయలేదని పేర్కొన్నారు.కానీ భారత్ లో శాంతికి విఘాతం కలిగించాలని చూస్తే సరైన సమాధానం ఇస్తామని శత్రు దేశాలకు హెచ్చరికలు జారీ చేశారు.

పాకిస్తాన్ ఆక్రమణలో ఉన్నప్పటికీ పీవోకేలో ఒక కుటుంబానికి కూడా ఎలాంటి నష్టం జరగనీయబోమని స్పష్టం చేశారు.

Advertisement
వాడిన కాఫీ పొడిని మ‌ళ్లీ ఇలా కూడా వాడొచ్చు.. తెలుసా?