జనసేనలో ఇకపై నాగబాబు నెం.2

జనసేన పార్టీ( Janasena party ) లో పవన్ కళ్యాణ్ తర్వాత స్థానం ఎవరిది అంటే నిన్న మొన్నటి వరకు నాదెండ్ల మనోహర్ ది అంటూ ప్రతి ఒక్కరు మాట్లాడుకునే వారు.

కానీ ఇప్పుడు ఆయన స్థానాన్ని నాగబాబు ఆక్రమించేలా ఉన్నారు.

ఇటీవల నాగబాబు కి ప్రధాన కార్యదర్శి పోస్ట్ ఇచ్చి ప్రమోషన్ ఇవ్వడం జరిగింది.

ఇన్నాళ్లు పార్టీ లో ప్రాముఖ్యత లేని పదవి లో ఉన్న నాగబాబు ఇప్పుడు అత్యంత కీలకమైన పదవి రావడం తో నెంబర్ 2 గా మారే అవకాశాలు కనిపిస్తున్నాయి, ప్రతి విషయం లో కూడా ఇంతకు ముందు పవన్ కళ్యాణ్ మరియు నాదెండ్ల మనోహర్( Nadendla Manohar ) చర్చించేవారు.కానీ ఇక నుండి నాగబాబు తో పవన్ కళ్యాణ్ అన్ని విషయాల్లో చర్చించబోతున్నారు.

పవన్ కళ్యాణ్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని కొందరు వ్యతిరేకిస్తూ ఉంటే మరి కొందరు మాత్రం సమర్థిస్తున్నారు.పవన్ కళ్యాణ్( Pawan kalayn ) కుటుంబాన్ని ప్రోత్సహిస్తున్నాడు అంటూ కొందరు ఆరోపిస్తున్నారు.జనసేన పార్టీ పెట్టినప్పటి నుండి కూడా పవన్ కళ్యాణ్ కి తోడుగా నాగబాబు ఉన్నాడు.

Advertisement

పార్టీ లో అత్యంత కష్టపడ్డాడు.అందుకే ఆయన కష్టానికి ప్రతిఫలం అన్నట్లుగా ప్రధాన కార్యదర్శి పదవిని ఇచ్చి గౌరవించినట్లుగా పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చాడు.

అతి త్వరలోనే పవన్ కళ్యాణ్ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన ను మొదలు పెట్టబోతున్నారు.అందుకు సంబంధించిన వ్యవహారాలన్నీ కూడా నాగబాబు దగ్గరుండి చూసుకుంటారని తెలుస్తోంది.

మొత్తానికి జనసేన పార్టీలో నాగబాబు చోటు దక్కించుకోవడంతో మెగా అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

జనసేన పార్టీ కార్యకర్తలు కొందరు మాత్రం కుటుంబ పార్టీగా మారుతుందంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.జనసేన పార్టీ ని వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి తీసుకు రావడం కోసం తీవ్రంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.అందులో భాగంగానే పవన్ పార్టీని మరియు నాయకులను మార్చే ప్రయత్నాలు చేస్తున్నారు.

వీడియో వైరల్ : ఇదేందయ్యా ఇది.. ఆవు అక్కడికి ఎలా వెళ్లిందబ్బా..?
Covid Declining Covid Cases In India Health Covid India Corona COVIDCases CovidIn

అందుకే నాగబాబుకు ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చి ఉంటారు అంటున్నారు.

Advertisement

తాజా వార్తలు