చైతూ సినిమా కోసం తెరపైకి రష్మిక పేరు

అక్కినేని వారసుడు నాగ చైతన్య ప్రస్తుతం శేఖర్ కమ్ముల దర్శకత్వంలో లవ్ స్టొరీ అనే సినిమా చేస్తున్నాడు.

ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్ గా నటిస్తుంది.

ఇక ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది.ఇదిలా ఉంటే ఈ సినిమా తర్వాత చైతూ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో థాంక్యూ చెప్పడానికి రెడీ అవుతున్నాడు.

ఈ సినిమాకి సంబందించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ఇప్పటికే మొదలైంది.ప్రస్తుతం హీరోయిన్ ఎంపిక మీద విక్రమ్ శ్రద్ధ పెట్టాడు.

ఇందులో హీరోయిన్ గా ఎవరిని తీసుకోవాలనే విషయం మీద దర్శకుడు తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తుంది.ముందుగా కీర్తి సురేష్ అనుకున్న ఇప్పట్లో ఆమె డేట్స్ ఖాళీగా లేవు.

Advertisement

ఈ నేపధ్యంలో సూపర్ హిట్ కాంబినేషన్ అయిన మొగుడుపెళ్ళాలు సమంత, చైతూ అయితే పాజిటివ్ రెస్పాన్స్ కూడా ఉంటుందని భావించారు.అయితే ప్రస్తుతం సమంత సోలోగా ఎదిగే ప్రయత్నం చేస్తుంది.

అలాగే హీరోయిన్ పాత్రకి ప్రాధాన్యత ఉంది అంటేనే చేస్తుంది.ఈ నేపధ్యంలో ఆమె విక్రమ్ కుమార్ కి వేరొక హీరోయిన్ చూడమనే ఆప్షన్ ఇచ్చినట్లు తెలుస్తుంది.

ఈ నేపధ్యంలో రష్మిక పేరు తెరపైకి వచ్చింది.ప్రస్తుతం పుష్ప సినిమాతో పాటు, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్, మురుగదాస్ కాంబినేషన్ సినిమా కోసం రష్మికని ఎంపిక చేసినట్లు తెలుస్తుంది.

ఈ నేపధ్యంలో సౌత్ లో ఒకే సారి ఇద్దరు స్టార్ హీరోలతో జతకట్టడం వలన డేట్స్ కోసం చూస్తున్నట్లు తెలుస్తుంది.మరి ప్రస్తుతం విక్రమ్ తన ముందు ఉన్న ఛాయస్ ప్రకారం సమంత, రష్మికలో ఎవరిని ఫైనల్ చేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.

సూర్య తో మల్టీ స్టారర్ సినిమా చేయనున్న మరో స్టార్ హీరో...
Advertisement

తాజా వార్తలు