ఆదిపురుష్ కోసం బైక్ మీద ముంబై టు తిరుపతి.. చరిత్రలో తొలిసారి అలా..

ఇతిహాస గ్రంధం రామాయణం ఆధారంగా తెరకెక్కిన మూవీ ఆదిపురుష్( Adipurush ).

బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్( Director Om Raut ) దర్శకత్వంలో తెరకెక్కిన ఈ పీరియాడిక్ వండర్ లో కృతి సనన్( Kriti Sanon ) సీత పాత్రలో నటిస్తున్న విషయం విదితమే.

అలాగే సైఫ్ అలీ ఖాన్ రావణాసురిడిగా నటిస్తుండగా.సన్నీ సింగ్ లక్షణుడిగా నటిస్తున్నాడు.

తెలుగు, హిందీ భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన ఈ సినిమాను టి సిరీస్ సంస్థ, రిట్రో ఫైల్స్ 500 కోట్ల భారీ బడ్జెట్ తో సంయుక్తంగా నిర్మించారు.మరో 10 రోజుల్లో గ్రాండ్ రిలీజ్ కానున్న నేపథ్యంలో ఈ సినిమా కోసం మేకర్స్ భారీ ప్రమోషన్స్ కు సిద్ధం అవుతున్నారు.

మరి ఈ క్రమంలోనే మ్యూజిక్ డైరెక్టర్ గా తనవంతు ప్రమోషన్స్ చేయడానికి అజయ్ - అతుల్ సంగీత ద్వయం సిద్ధం అయ్యింది.వీరు బాలీవుడ్ లో బాగా పాపులర్.

Advertisement

మరి ఆదిపురుష్ తో తెలుగులోకి కూడా ఈ సంగీత స్వయం ఎంట్రీ ఇవ్వబోతున్నారు.

తాజాగా అందుతున్న వార్తల ప్రకారం సంగీత స్వరకర్తలలో ఒకరైన అతుల్ కొత్త ప్రయోగం చేయడానికి సిద్ధం అవుతున్నారట.ముంబై నుండి తిరుపతి వరకు బైక్ మీద వచ్చేందుకు సిద్ధం అవుతున్నారు అని తెలుస్తుంది.ఆదిపురుష్ మీద ఉన్న ప్రేమతో అతుల్ ఇలా చేయాలని అనుకుంటున్నారట.

జూన్ 6న తిరుపతిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగనున్న విషయం తెలిసిందే.

ఈ ఈవెంట్ కు హాజరయ్యేందుకు ఈయన బైక్ మీద తిరుపతి బయల్దేరనున్నాడట.తిరుపతి( Tirupati ) చేరుకున్న తర్వాత ఆయన సోదరుడు అజయ్ తో కలిసి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని ఆయన పాదాల వద్ద జై శ్రీరామ్ సాంగ్ ను సమర్పించనున్నారు.ఇక వీరికి ఘన స్వాగతం పలికేందుకు ప్రభాస్ అండ్ టీమ్ తిరుపతిలో రెడీగా ఉంటారట.

How Modern Technology Shapes The IGaming Experience
మన భారతీయ సంప్రదాయంలో కొబ్బరికాయకు ఉన్న ప్రాధాన్యత ఏమిటి?

మరి చరిత్రలో తొలిసారి ఒక మ్యూజిక్ డైరెక్టర్ సినిమాపై ఉన్న ప్రేమను చాటుకో బోతున్నారు.

Advertisement

తాజా వార్తలు