నీళ్లు ఇవ్వలేని దద్దమ్మలు మంత్రులు..: జగదీశ్ రెడ్డి

నల్లగొండ ఎంపీ స్థానంలో బీఆర్ఎస్ జెండా ఎగరేస్తామని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి( Jagadish Reddy ) అన్నారు.

గులాబీ జెండానే తెలంగాణకు శ్రీరామ రక్ష అని తెలిపారు.

పూటకో మాట మార్చే పార్టీ కాంగ్రెస్( Congress ) అని ప్రజలకు అర్థమైందని జగదీశ్ రెడ్డి పేర్కొన్నారు.రుణమాఫీపై మాట మార్చారన్నారు.

అన్నదాతలను కాంగ్రెస్ నిలువునా మోసం చేసిందని ఆరోపించిన జగదీశ్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) బూతులు, అబద్దాలతో కాలం వెల్లదీస్తున్నారని పేర్కొన్నారు.నీళ్లు ఇవ్వలేని దద్దమ్మలు మంత్రులంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

సాగర్ డ్యామ్ మీదకు వెళ్లే దమ్ము కాంగ్రెస్ వాళ్లకు లేదని ఎద్దేవా చేశారు.

Advertisement
విశ్వక్ సేన్ కు జోడీగా డ్రాగన్ బ్యూటీ.. టాలీవుడ్ లో ఈమె బిజీ కావడం ఖాయమా?

తాజా వార్తలు