పోలవరం ప్రాజెక్టుపై మంత్రి అంబటి వివరణ

ఏపీ అసెంబ్లీలో పోలవరం ప్రాజెక్టుపై మంత్రి అంబటి రాంబాబు వివరణ ఇచ్చారు.పోలవరం పట్ల రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని చెప్పారు.

పోలవరం ప్రాజెక్టు వైఎస్ఆర్ సంకల్పమని తెలిపారు.పోలవరం ప్రాజెక్టును సీఎం జగన్ పూర్తి చేస్తారని మంత్రి అంబటి స్పష్టం చేశారు.

పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంలా వాడుకున్నారని విమర్శించారు.దోచుకో.

పంచుకో.తినుకో పద్ధతిలో తినే కార్యక్రమం చేశారని ఆరోపించారు.

Advertisement

ఇప్పుడు పోలవరం ఆగిపోయిందని మాట్లాడుతున్నారన్నారు.రూ.20,398 కోట్ల కన్నా ఎక్కువగా ఖర్చు చేయడం జరిగిందని తెలిపారు.ఒప్పందం ప్రకారం కేంద్రం డబ్బులు ఇచ్చే అవకాశం లేదన్నారు.తమ ప్రభుత్వం వచ్చాక రీ ఎస్టిమేట్ చేస్తే రూ.55,656 కోట్లు అయిందని పేర్కొన్నారు.ఇంతకముందు అగ్రిమెంట్ ప్రకారం రూ.30 వేల కోట్ల నష్టం జరిగిందని వెల్లడించారు.

పెన్షన్ల విషయంలో చంద్రబాబు రాజకీయం.. : సీఎం జగన్
Advertisement

తాజా వార్తలు