మంత్రి మల్లారెడ్డి వివాహ వార్షికోత్సవ వేడుకలు

మంత్రి మల్లారెడ్డి వివాహ వార్షికోత్సవాన్ని పురస్కరించుకొని బోయిన్ పల్లిలోని మంత్రి నివాసం వద్ద సందడి వాతావరణం నెలకొంది పెద్ద ఎత్తున నేతలు కార్యకర్తలు మంత్రి నివాసం వద్దకు చేరుకొని శుభాకాంక్షలు తెలపడానికి, మంత్రి దృష్టిలో పడడానికి పోటీ పడ్డారు.

మంత్రి మల్లారెడ్డి దంపతులు కుటుంబసభ్యులతో కలసి ఉదయం తాడ్బంద్ హనుమాన్ దేవాలయంలో ఆంజనేయ స్వామిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు.

అనంతరం ఇంటికి చేరుకున్న మంత్రి దంపతులు టీఆరెస్ యువనేత టింకు గౌడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కేకును కట్ చేశారు.మహిళలకు చీరలను పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా టింకు గౌడ్ మాట్లాడుతూ మా అభిమాన నాయకుడు మంత్రి మల్లారెడ్డి ఎల్లప్పుడు పేద ప్రజల సంక్షేమం కోసం పాటు పడతారని తెలిపారుశ్రీమతి మల్లారెడ్డి గారు కూడా ఎల్లప్పుడు మంత్రిగారి అడుగుజాడలలో నడుస్తు టీఆరెస్ నేతలు కార్యకర్తలను కుటుంబ సభ్యుల వలనే ఆప్యాయంగా పలుకరిస్తారని పేర్కొన్నారు. దేవుడు, ప్రజల ఆశీస్సులతో నిండు నూరేళ్లు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో మంత్రి మల్లారెడ్డి దంపతులు ఉండాలని కోరుకుంటున్నట్లు వెల్లడించారు.

సింప్లిసిటీకి పర్‌ఫెక్ట్‌ ఎగ్జాంపుల్‌ ప్రభాస్‌.. వైరల్ అవుతున్న శిరీష్ ఆసక్తికర వ్యాఖ్యలు!
Advertisement

తాజా వార్తలు