చంద్రబాబుకు మంత్రి జయరాం సవాల్

టీడీపీ అధినేత చంద్రబాబు అభివృద్ధిపై చర్చకు రావాలని మంత్రి జయరాం సవాల్ చేశారు.గతంలో ఏపీని చంద్రబాబు అభివృద్ధి చేయలేదన్నారు.

కానీ వైసీపీ ప్రభుత్వ పాలనలో అర్హులకు సంక్షేమ పథకాలు అందిస్తున్నామని చెప్పారు.రోడ్లు, డ్రైనేజీ, మంచినీటి సౌకర్యాలు కల్పిస్తున్నామని తెలిపారు.

రాష్ట్రంలో చంద్రబాబుకు అభివృద్ధి కనిపించడం లేదా అని ప్రశ్నించారు.గడప గడపకు ప్రభుత్వం కార్యక్రమంలో ప్రజలు బ్రహ్మరధం పడుతున్నారని వెల్లడించారు.

రానున్న ఎన్నికల్లో ఏపీలో 175 కు 175 స్థానాల్లో గెలుస్తాం అని ధీమా వ్యక్తం చేశారు.

Advertisement
వాడిన కాఫీ పొడిని మ‌ళ్లీ ఇలా కూడా వాడొచ్చు.. తెలుసా?