Minister Ambati Rambabu : టీడీపీ-బీజేపీ-జనసేన ఫెయిల్యూర్ కాంబినేషన్ అంటూ మంత్రి అంబటి కామెంట్స్..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు( AP Politics ) రోజురోజుకీ మారిపోతున్నాయి.ఎన్నికలకు ఇంకా రెండు నెలలు మాత్రమే సమయం ఉంది.

ప్రస్తుతం అధికారంలో ఉన్న వైసీపీ వచ్చే ఎన్నికలలో ఒంటరిగా పోటీ చేస్తూ ఉంది.తెలుగుదేశం జనసేన పార్టీలు కూటమి( TDP Janasena )గా ఏర్పడటం తెలిసిందే.

ఇప్పుడు ఈ కూటమిలోకి బీజేపీ జాయిన్ కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.మొదటినుండి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోకుండా చంద్రబాబు పవన్ జాగ్రత్త పడుతున్నారు.

ఈ క్రమంలో 2014 ఎన్నికల మాదిరిగా గెలవాలని వ్యూహాలు వేస్తున్నారు.ఆ దిశగానే ఇప్పుడు బీజేపీ.

Advertisement

చంద్రబాబుతో కలిసినట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ క్రమంలో వైసీపీ మంత్రి అంబటి రాంబాబు( YCP Minister Ambati Rambabu ) సంచలన వ్యాఖ్యలు చేశారు.మొదటి నుంచి ఆ మూడు పార్టీలు కలిసి పోటీ చేస్తాయని చెబుతూనే ఉన్నాం.సో ఇప్పుడు టీడీపీ.

బీజేపీ కలయిక మాకు ఆశ్చర్యం అనిపించడం లేదు.టీడీపీ-బీజేపీ-జనసేన( TDP BJP Janasena ) ఫెయిల్యూర్ కాంబినేషన్ అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఆ కూటమిని ప్రజలు తిరస్కరించడం జరిగింది.మాకు 50 శాతానికి పైగా ఓటు బ్యాంకు ఉంది.

మహేష్ తో మల్టీస్టారర్ పై కార్తీ ఆసక్తికర వ్యాఖ్యలు.. మేమిద్దరం క్లాస్ మేట్స్ అంటూ?
' హైడ్రా బాధితులకు బీఆర్ఎస్సే దిక్కు ! తెలంగాణ భవన్ కు వారంతా క్యూ 

ఎంతమంది కలిసి వచ్చిన విజయం మాదే అని మంత్రి అంబటి రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేయడం జరిగింది.ప్రస్తుతం చంద్రబాబు( Chandrababu Naidu ) ఢిల్లీ పర్యటనలో ఉన్నారు.

Advertisement

ఈ క్రమంలో ఢిల్లీ బీజేపీ పెద్దలతో కలిసినట్లు పొత్తు కన్ఫర్మ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.

తాజా వార్తలు