అర్ధరాత్రి అమ్మాయిల హాస్టల్‌లో దూరిన ప్రిన్సిపాల్‌.. చివరకు?

ఈ మధ్యకాలంలో విద్యా సంస్థలపై నెటిజన్ల దృష్టి మరింతగా పెరిగింది.విద్యార్థులపై జరిగే అక్రమాలు, అసాధారణ ఘటనలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

ఇటువంటి సందర్భాల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారికి ప్రజలు తీవ్రంగా స్పందిస్తున్నారు.తాజాగా తిరుపతిలో( Tirupati ) చోటుచేసుకున్న ఓ ఘటన ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

తిరుపతి నగరంలోని లీలామహల్ సర్కిల్ ప్రాంతంలో ఉన్న వర్మ నర్సింగ్ కాలేజ్( Varma Nursing College ) గర్ల్స్ హాస్టల్‌లో బుధవారం అర్ధరాత్రి ఒక దారుణ ఘటన వెలుగు చూసింది.ప్రిన్సిపాల్ వర్మ,( Principal Varma ) అర్ధరాత్రి సమయంలో విద్యార్థినులు ఉంటున్న గదిలోకి అనుమతి లేకుండా ప్రవేశించినట్టు విద్యార్థినులు ఆరోపించారు.

దీంతో హాస్టల్‌లో ఉన్న విద్యార్థినులు అతడిని గదిలోనే బంధించి, వెంటనే అలిపిరి పోలీసులకు సమాచారం అందించారు.

Advertisement

పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని ప్రిన్సిపాల్ వర్మను అదుపులోకి తీసుకున్నారు.ఈ ఘటన హాస్టల్ వద్ద తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.ప్రిన్సిపాల్‌కు కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ విద్యార్థినులు నినాదాలు చేశారు.

వర్మకు తగిన శిక్ష పడాలని కోరుతూ, స్టేషన్ ఎదుట నిరసనలు కొనసాగించారు.అయితే, ఈ ఘటనపై మరో కోణంలో కొందరు విద్యార్థినులు స్పందించారు.

పక్క భవనంలో దూకిన ఓ విద్యార్థిని ప్రవర్తనను ప్రశ్నించినందుకు ప్రిన్సిపాల్‌పై కావాలనే తప్పుదోవ పట్టించేలా ఆరోపణలు చేస్తున్నారని పేర్కొన్నారు.వాస్తవానికి రాత్రి వేళ హాస్టల్‌ నుంచి బయటకు వెళ్లే వారిని నిలిపేందుకు ఆయన ఆ గదికి వెళ్లినట్టు చెబుతున్నారు.

ప్రస్తుతం అలిపిరి పోలీసులు ఈ ఘటనపై సమగ్ర విచారణ చేపట్టారు.నిజానిజాలు వెలుగులోకి రానున్న కొద్ది రోజుల్లో, దీనికి సంబంధించి మరిన్ని విషయాలు బయటకు రావొచ్చని పోలీస్ వర్గాలు తెలిపారు.ఈ సంఘటనపై వీడియోలు, ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ, పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారాయి.

మైదా పిండిని ఎలా తయారు చేస్తారు.. ఆరోగ్యానికి అది ఎందుకు మంచిది కాదు?

ఈ ఘటన విద్యా సంస్థల్లో భద్రత, నైతిక విలువలపై పలు ప్రశ్నలు లేవనెత్తింది.

Advertisement

తాజా వార్తలు