ప్రదీష్ కుమార్ 25 ఏళ్ళు! ఇప్పటి వరకు అతని టార్గెట్ 50 మంది

సోషల్ మీడియా, టెక్నాలజీ అందుబాటులోకి వచ్చిన తర్వాత నేటి తరం యువత దానిని సరైన పంథాలో ఉపయోగించుకోకుండా తప్పుడు పనులకి, శారీరక కోరికలు తీర్చుకోవడానికి ఉపయోగిస్తున్నారు.

అయితే ఇలాంటి తప్పుడు పనులు ఎక్కువ కాలం దాగి ఉండవనే విషయాన్ని తెలుసుకోలేక అదే పనిగా తప్పులు చేస్తూ చివరికి జైలు ఊచలు లెక్కపెడుతున్నారు.

ఈ మధ్య కాలంలో మహిళల మీద వేదింపులు ఎంత తీవ్ర స్థాయిలో పెరిగాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.ఇక కేరళకి చెందిన యువకుడు కూడా తనకి తెలిసిన టెక్నాలజీ తెలివిని మహిలపై వేదింపులకి, వారితో కోరికలు తీర్చుకోవడానికి ఉపయోగించాడు.

ఏకంగా 50 మంది మహిళలని వేదింపులకి గురి చేసి ఇప్పుడు జైలు జీవితం అనుభవిస్తున్నాడు.కేరళలోని అరీపరంబు అనే ప్రాంతానికి చెందిన ప్రదీష్ కుమార్ అనే పాతికేళ్ల యువకుడు మహిళలని టార్గెట్ చేసేవాడు.

మొదట ఎవరిని టార్గెట్ చేయాలనుకున్నాడో వారితో పరిచయం పెంచుకోవడం, ముఖ్యంగా వివాహితలని లక్ష్యంగా చేసుకోవడం చేసేవాడు.వారి కుటుంబ వివరాలు, సమస్యలు తెలుసుకున్న తర్వాత ఓ నకిలీ ఫేస్ బుక్ ఐడీతో ఆ మహిళ భర్తతో చాటింగ్ ప్రారంభించే వాడు, వాళ్ళు వీడి ట్రాప్‌లో పడిన తర్వాత ఆ ఛాట్ వివరాలను చూపించి, మీ భర్త వేరే మహిళలో రొమాన్స్ చేస్తున్నాడు కాబట్టి మన ఇద్దరికి సమస్య ఉండబోదు అనే విధంగా మహిళలని లోబరుచుకొని కోరికలు తీర్చుకునే వాడు.

Advertisement

ఇలా వీడి చేతిలో చాలా మంది వివాహితలు నలిగిపోయారు.ఏకంగా 50 మంది మహిళలని తన వలలో వేసుకొని కొందరిని ఒప్పించి శారీరక వాంచలు తీర్చుకోగా.

మరి కొన్న్ధరిని బెదిరించి లొంగదీసుకున్నాడు.చివరికి ఓ మహిళ ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగి వాడి బాగోతాలు బయట పెట్టారు.

Advertisement

తాజా వార్తలు