దీపావళి రోజు కరెన్సీ నోట్లను కాల్చేసిన వ్యక్తి.. వీడియో వైరల్‌..

దీపావళి(Diwali) పండుగ సందర్భంగా చాలామంది తమ స్నేహితులు, కుటుంబ సభ్యులతో కలిసి ఆనందంగా గడిపారు.బాణాసంచా కాల్చుతూ భారతదేశం అంతటా వెలుగులు నింపారు.

దీపావళి సెలబ్రేషన్స్ కు సంబంధించి చాలా వీడియోలు సోషల్ మీడియాలోనూ వైరల్ అయ్యాయి.అలాంటి వాటిలో ఒక వీడియో చాలా మంది దృష్టిని ఆకర్షించింది.అందులో ఒకరు రూ.100, రూ.500 నోట్లను కాల్చివేస్తున్న(100, 500,notes burn) దృశ్యం కనిపించింది.వీడియోలో నోట్లకు నిప్పు అంటుకొని అవి దహనం అవ్వడం చూడవచ్చు.

వాటి నిప్పును ఎవరూ ఆర్పడానికి ప్రయత్నించకపోవడం గమనార్హం.ఎవరో ఉద్దేశపూర్వకంగానే ఆ నోట్లను కాల్చివేశారు.

కొద్ది సేపటికే నోట్లు పూర్తిగా కాలిపోయి బూడిదగా మారిపోయాయి.ఎవరో తమ కష్టార్జితమైన డబ్బును ఇలా నాశనం చేశారు.

Advertisement

ఇది చూసిన నెటిజన్లు షాక్ అయ్యారు.

కానీ, వీడియోను జాగ్రత్తగా గమనిస్తే ఒక ఆసక్తికరమైన విషయం తెలిసింది.నోట్లపై ఉన్న విలువ (రూ.100 లేదా రూ.500) కింద భాగంలో “ఫుల్ ఆఫ్ ఫన్” అని రాసి ఉంది.నిజమైన నోట్లపై ఇలాంటి వర్డ్స్ ఏమీ ఉండవు.

అంటే ఆ వీడియోలో ఉన్న నోట్లు నకిలీవి అని అర్థం.ఆ వీడియోను ఎవరో సరదాగా చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

ఈ వీడియో వైరల్‌గా మారింది.రిషు బాబు పాడిన "బేవఫా సే ప్యార్ హో గయా" పాటను బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్‌గా వాడారు.

5 Gringos Customer Support And Service Quality (AU) — A Practical Guide
చర్మ ఆరోగ్యం కొరకు ద్రాక్షలో ఉన్న ప్రయోజనాలు

ఈ వీడియో చూసిన కొంతమంది, దీపావళి సమయంలో లక్ష్మీదేవిని (Lakshmi Devi)అవమానించారని ఆ వ్యక్తిని తప్పుపట్టారు.కానీ, మరికొందరు ఆ నోట్లు నకిలీవి అని, ఈ వీడియోను కేవలం ఫన్ కోసం చేశారని చెప్పారు.ఈ వీడియో ఎక్కడ చిత్రీకరించారో ఇంకా తెలియరాలేదు.

Advertisement

మరోవైపు దీపావళి పండుగ అయిన తర్వాత, శుక్రవారం ఉదయం ఢిల్లీ నగరం మొత్తం పొగ కమ్మకుంది.గాలి నాణ్యత చాలా దిగజారిపోయి, ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 321 స్కోరు నమోదైంది.

కాలుష్యంతో పాటు, అగ్నిప్రమాదాల సంఖ్య కూడా పెరిగింది.ఈ దీపావళిలో నగరంలో 300 కంటే ఎక్కువ అగ్నిప్రమాదాలు సంభవించాయి.

ఇది గత 13 సంవత్సరాలలో అత్యధిక సంఖ్య.అధికారుల అభిప్రాయం ప్రకారం, పటాకుల అధిక వినియోగం వల్లే ఈ అగ్నిప్రమాదాలు పెరిగాయి.

తాజా వార్తలు