ఓ పిట్ట కథ చెబుతున్న మహేష్

సూపర్ స్టార్ మహేష్ బాబు ఇతర స్టార్ హీరోల చిత్రాలను ప్రోత్సహించడంలో ఎప్పుడూ ముందుంటాడు.

ఈ క్రమంలో చిన్న సినిమాలను కూడా మహేష్ తరుచూ ఎంకరేజ్ చేస్తూ తన మంచితనాన్ని చాటుతుంటాడు.

తాజాగా మరో చిన్న చిత్రాన్ని మహేష్ బాబు ప్రమోట్ చేయడానికి ముందుకు వచ్చాడు.క్యారెక్టర్ ఆర్టిస్టు బ్రహ్మాజీ కొడుకు సంజయ్, విశ్వాంత్, నిత్యా శెట్టిలు కలిసి నటిస్తున్న ఓ పిట్ట కథ సినిమా టీజర్‌ను మహేష్ బాబు ఫిబ్రవరి 7న సాయంత్రం 5.05 నిమిషాలకు లాంఛ్ చేయనున్నాడు.టాలీవుడ్‌లో స్టార్ హీరోలందరితో నటించి మంచి పేరు తెచ్చుకున్న బ్రహ్మాజీ కొడుకు ఈ సినిమాలో నటిస్తుండటంతో, ఆయనతో మహేష్‌కు మంచి సంబంధం ఉండటంతో ఈ టీజర్ లాంఛ్‌కు ఓకే చెప్పాడు సూపర్ స్టార్.

కొత్త దర్శకుడు చందు ముద్దు డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాను భవ్య క్రియేషన్స్ బ్యానర్‌పై ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్నాడు.మరి సూపర్ స్టార్ సాయం ఈ సినిమాకు ఎంతమేర ఉపయోగపడుతుందో చూడాలి.

ఇక మహేష్ తన నెక్ట్స్ మూవీని దర్శకుడు వంశీ పైడిపల్లి డైరెక్షన్‌లో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.

Advertisement
నాగార్జునతో ప్రతి ఒక్కరు ప్రేమలో పడతారు.. కుష్బూ సంచలన వ్యాఖ్యలు!

తాజా వార్తలు