బిగ్ బాస్ కంటెస్టెంట్స్ పై మాధవి లతా ఫేస్బుక్ లో సంచలన పోస్ట్.! తనీష్ నచ్చాడంట.!

బిగ్‌బాస్‌ తెలుగు సీజన్‌ 2 అతి త్వరలోనే పూర్తి కాబోతుంది.ఈ సారి ఆరంభం నుండి కూడా విమర్శలు వ్యక్తం అవుతూనే ఉన్నాయి.

ఆ విమర్శలను ఎదుర్కొంటూనే బిగ్‌బాస్‌ను ముందుకు తీసుకు వెళ్తున్నారు.సెలబ్రెటీల విషయంలో ఆరంభంలోనే పెదవి విరిచిన ప్రేక్షకులు ఆ తర్వాత ఒక్కొ ఇంటి సభ్యుడిపై ఒక్కో విధంగా స్పందస్తూ వస్తున్నారు.

ఈ విషయంపై మాధవి లతా అందరు కంటెస్టెంట్స్ కి రేటింగ్ ఇస్తూ ఫేస్బుక్ లో ఓ పోస్ట్ చేసింది.అందులో ఏం రాసింది అంటే. కోర్టు పని మీద సామ్రాట్ రెండు సార్లు బయటకి వెళ్లాడు.అప్పుడు తన అమ్మని కలవలేదా.? ఒకే నెలలో రెండు సార్లు ఫ్యామిలీ కేసు మీద వెళ్తే కుటుంబ సబగులను కలవడా.?.ఇంట్లోకి వచ్చిన సామ్రాట్ తల్లి ఎంతకాలం అయింది నిన్ను చూసి, నువ్వు స్ట్రాంగ్ అనుకోలేదు అనడం ఏంటి.? ఏమో నాకు డౌటే తనీష్ నాకు నచ్చడు.తన ఆలోచన విధానం తప్పు.

కౌశల్ పాపని చూసినప్పుడు మాత్రం మీ పాప చాలా క్యూట్ గా ఉంది.మీకు నాకు ఎన్ని ఉన్నా మీ పాప కోసం మాత్రం మీ ఇంటికి వస్తాను అన్నాడు.

Advertisement

అది హార్ట్ ఫుల్ గా అన్నాడు.ఇక తనీష్ తమ్ముడు మాత్రం తన అన్నకి శత్రువైన కౌశల్ తనకు కూడా శత్రువు అన్నట్లుగా ప్రవర్తించాడు అంటూ సోషల్ మీడియాలో రాసుకొచ్చింది.

Advertisement