భారత క్రికెట్ జట్టుకు కోచ్‌గా లక్ష్మణ్.. త్వరలో బాధ్యతలు

ఐపీఎల్ 2022 తర్వాత భారత జట్టు అంతర్జాతీయ నిరంతరాయ క్రికెట్‌ను ఆడనుంది.

ఇక టీమిండియా ప్రధాన కోచ్ రాహుల్ ద్రవిడ్ సీనియర్ జట్టుతో కలిసి ఇంగ్లాండ్‌లో పర్యటించనున్నాడు.

సరిగ్గా అదే సమయంలో, జూన్ 26, 28 తేదీల్లో ఐర్లాండ్‌తో జరిగే రెండు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌కు మరో జట్టు వెళ్లనుంది.ఆ జట్టుకు ప్రస్తుతం జాతీయ క్రికెట్ అకాడమీ చీఫ్ వీవీఎస్ లక్ష్మణ్ ప్రధాన కోచ్‌గా కనిపించనున్నారు.

అయితే ఈ సిరీస్‌కు భారత జట్టును ఇంకా ప్రకటించలేదు.ఎన్‌సీఏ కోచ్‌లు సితాన్షు కోటక్, సాయిరాజ్ బహుతులే, మునీష్ బాలి ఈ నెల చివరిలో ఐర్లాండ్ పర్యటనలో భారత క్రికెట్ జట్టు సహాయక సిబ్బందిలో భాగం అవుతారు.

వీరికి వీవీఎస్ లక్ష్మణ్ నాయకత్వం వహిస్తాడు.సితాన్షు కోటక్ గతంలో కూడా ఇండియా ఏ టీమ్ సిస్టమ్‌లో భాగమయ్యాడు.

Advertisement

ఆయన బ్యాటింగ్ కోచ్‌గా వ్యవహరించనున్నాడు.బాలి, బహులేలకు వరుసగా ఫీల్డింగ్, బౌలింగ్ బాధ్యతలు కేటాయించారు.

సీనియర్ టీమిండియా జట్టు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన తర్వాత దక్షిణాఫ్రికాతో జరుగుతున్న టీ20 ఇంటర్నేషనల్ సిరీస్ (రాజ్‌కోట్ మరియు బెంగళూరు) చివరి రెండు మ్యాచ్‌ల సందర్భంగా బాలి, కోటక్, బహులే జట్టుతో కలుస్తారు.రాహుల్ ద్రవిడ్ ఇంగ్లండ్‌కు వెళ్లిన తర్వాత వీవీఎస్ లక్ష్మణ్ నేతృత్వంలోని ఐర్లాండ్ పర్యటనలో వారు జట్టుతో సహాయక సిబ్బందిగా కూడా ఉంటారు.

జూన్ 19 తర్వాత ఐర్లాండ్‌కు భారత యువ జట్టు బయలుదేరుతుంది.ఐర్లాండ్‌లో జూన్ 26, 28 తేదీల్లో జరిగే రెండు టీ20 అంతర్జాతీయ మ్యాచ్‌ల సిరీస్‌ను భారత్ ఆడాల్సి ఉంది.

అదే సమయంలో, ఇంగ్లండ్‌లో ఏకైక టెస్ట్ మ్యాచ్ తర్వాత కూడా, జట్టు మూడు మ్యాచ్‌ల వన్డే, టీ20 సిరీస్‌లు ఆడాల్సి ఉంది.

రాత్రి పడుకునే ముందు పెరుగన్నం తింటే ఏమవుతుందో తెలుసా?
Advertisement