పెళ్లి తర్వాత మొదటిసారి అలాంటి పోస్ట్ చేసిన కియారా.. ట్వీట్ వైరల్?

బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ, హీరో సిద్దార్థ్ మల్హోత్రా లు ఇటీవలె మూడుముళ్ల బంధంతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే.

ఫిబ్రవరి 7న రాజస్థాన్‌ లోని జైసల్మేర్‌ లో వీరి పెళ్లి ఘనంగా జరిగింది.

ఇరు కుటంబసభ్యులు, సన్నిహితుల సమక్షంలో సిద్దార్థ్ మల్హోత్రా, కియారాలు ఒక్కటయ్యారు.పెళ్లి తరువాత ముంబైలో గ్రాండ్‌ గా రిసెప్షన్‌ ను ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే.

ఇక పెళ్లి రిసెప్షన్ అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ జంట.సినిమాల పరంగా బిజీ బిజీ అవుతున్నారు.

కాగా ప్రస్తుతం ప్రస్తుతం కియారా అద్వానీ శంకర్‌ దర్శకత్వం లో పాన్‌ ఇండియా సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే.అందులో రామ్ చరణ్ హీరోగా నటిస్తున్నాడు.అయితే పెళ్లి సందర్బంగా సినిమా షూటింగ్ లకు సుమారు 20రోజులు బ్రేక్‌ తీసుకున్న కియారా ప్రస్తుతం బ్యాక్‌ టూ వర్క్‌ అంటూ సెట్స్‌లోకి అడుగుపెట్టింది.

Advertisement

దీనికి సంబంధించిన ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంది.తన ఇంస్టాగ్రామ్ లో ఒక ఫోటోని షేర్ చేస్తూ బ్యాక్ టు వర్క్ అని రాసుకొచ్చింది.మరొకవైపు సిద్దార్థ్ మల్హోత్రా కూడా తన తదుపరి సినిమాలో నటించడానికి సిద్ధంగా ఉన్నాడు.

ఇకపోతే ఈ జంట తాజాగా ముంబైలో జరిగిన ఓ అవార్డ్‌ ఫంక్షన్‌ కి హాజరైన విషయం తెలిసిందే.కాగా పెళ్ళికి ముందే సిద్దార్థ్ మల్హోత్రా, కియారా ఇద్దరూ ఇద్దరూ ప్రేమలో మునిగి తేలుతున్నారు అంటూ పెద్ద ఎత్తున వార్తలు వినిపించినప్పటికీ ఆ వార్తలపై అటు కియారా కానీ ఇటు సిద్ధార్థ్ కానీ స్పందించలేదు.వీరిద్దరూ కలిసి చాలాసార్లు కలిసి కనిపించడంతో అభిమానులు కూడా వార్తలను నిజమని నమ్మారు.

బయటకు ప్రకటించక పోయినప్పటికి ఈ జంట తాజాగా అదే వార్తలను నిజం చేస్తూ పెళ్లి చేసుకొని ఒక్కటయ్యారు.

Covid Declining Covid Cases In India Health Covid India Corona COVIDCases CovidIn
Advertisement

తాజా వార్తలు