Kangana ranuth : చరణ్, జక్కన్న గురించి అలాంటి కామెంట్లు చేసిన కంగనా రనౌత్.. ఆ బాధ ఇప్పటికీ ఉందంటూ? 

బాలీవుడ్ ఇండస్ట్రీలో కాంట్రవర్సీ క్వీన్ గా ఎన్నో వివాదాలలో నిలుస్తూ పేరు ప్రఖ్యాతలు పొందినటువంటి నటి కంగనా( Kangana ) ఈమధ్య కాలంలో బాలీవుడ్ సినిమాలపై కాస్త ఫోకస్ తగ్గించి సౌత్ సినిమాలపై ఫోకస్ పెట్టారని చెప్పాలి.

ఈ క్రమంలోనే ఈమె కోలీవుడ్ ఇండస్ట్రీలో పలు సినిమా అవకాశాలను అందుకొని నటిస్తున్నారని ఇక త్వరలోనే చంద్రముఖి 2 ( Chandramukhi 2 ) ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

ఇక ఈ ఈ సినిమా సెప్టెంబర్ 28వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి కంగనా రాజమౌళి ( Rajamouli ) రామ్ చరణ్( Ramcharan ) గురించి పలు విషయాలు వెల్లడించారు.

ఈ సందర్భంగా ఈమె మాట్లాడుతూ తాను ఏక్ నిరంజన్ సినిమాతో కాకుండా అంతకు ముందుగానే హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయం కావలసి ఉండేదని తెలిపారు.నాలోని యాక్ట్రర్ ను ముందుగా పూరి జగన్నాథ్ ( Puri Jagannath ) గుర్తించారు.దీంతో ఆయన దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా నటిస్తున్నటువంటి పోకిరి సినిమా( Pokiri Movie ) లో నాకు అవకాశం కల్పించారు.

అయితే అదే సమయంలోనే నేను గ్యాంగ్ స్టర్ సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నాను.దీంతో డేట్స్ అడ్జస్ట్ కాకపోవటం వల్లే పోకిరి సినిమాలో నటించలేకపోయానని ఇలా మహేష్ బాబుతో ఈ సినిమా వదులుకోవడంతో ఆ బాధ ఇప్పటికీ నన్ను వెంటాడుతూనే ఉందని కంగనా తెలిపారు.

Advertisement

ఇక ఈ సినిమా మిస్ అవ్వడంతో పూరి జగన్నాథ దర్శకత్వంలో ప్రభాస్ ( Prabhas ) హీరోగా నటించిన ఏక్ నిరంజన్ ( Ek Niranjan ) సినిమా ద్వారా నన్ను హీరోగా తెలుగు చిత్ర పరిశ్రమకు పూరి జగన్నాథ పరిచయం చేశారు.ఈ సినిమా ద్వారా ప్రభాస్ తో నాకు చాలా మంచి స్నేహం ఏర్పడిందని ఇప్పటికి ఆయనతో సినిమా అవకాశం వస్తే తప్పకుండా చేస్తాను అంటూ తెలిపారు.ప్రభాస్ కాకుండా ఇంకా ఏ హీరోలు ఏ దర్శకుడి దర్శకత్వంలో మీరు సినిమా చేయాలని ఉంది అనే ప్రశ్న ఈమెకు ఎదురు కావడంతో తనకు టాలీవుడ్ ఇండస్ట్రీలో రాజమౌళి సార్ దర్శకత్వంలో చేయాలని ఉంది.

అలాగే ఒక్క సినిమాలో ఆయన రామ్ చరణ్ సార్ తో కలిసి నటించాలని ఉంది అంటూ ఈ సందర్భంగా కంగనా తన మనసులో కోరికను బయట పెట్టారు.

Advertisement

తాజా వార్తలు