సింగరేణిలో ఉద్యోగాలను భర్తీ చేస్తాం: మంత్రి పొంగులేటి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో సింగరేణి ఎన్నికల ప్రచారంలో మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సింగరేణి ఎన్నికల్లో ఐఎన్టీయూసీని గెలిపించాలని కోరారు.

గత ప్రభుత్వం ఓటమి భయంతో ఎన్నికలు జరపలేదని మంత్రి పొంగులేటి ఆరోపించారు.సింగరేణిలో ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పారు.నూతన అండర్ గ్రౌండ్ బొగ్గుగనులను ఏర్పాటు చేస్తామన్నారు.

కాంట్రాక్టు కార్మికుల సమస్యల పరిష్కారానికి హైపవర్ కమిటీని నియమించనున్నట్లు తెలిపారు.అలాగే మ్యానిఫెస్టోలో పెట్టిన సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఏర్పాటు చేస్తామని వెల్లడించారు.

పెద‌వులు పింక్‌గా, షైనీగా మారాలా? నెయ్యితో ఇలా చేయండి!
Advertisement