పదేళ్లలో పవన్ పీఎం అవుతారు.. జోస్యం చెప్పిన జానీ మాస్టర్!

ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్న సంగతి మనకు తెలిసిందే.

ఇలా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వంలో శాఖలను కేటాయించే విషయం నుంచి మొదలుకొని అన్ని విషయాలలో కూడా టీడీపీ( TDP ) జనసేన( Janasena ) మధ్య ఎలాంటి విభేదాలు లేకుండా ముందుకు వెళ్తున్నాయి.

కానీ ఇటీవల పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) గురించి తన అపర భక్తుడు కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్( Jani Master ) చేసిన కామెంట్స్ ప్రస్తుతం టీడీపీ,జనసేన నాయకుల మధ్య పలు చర్చలకు కారణమయ్యాయి.

పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వేడుకలను రాష్ట్రవ్యాప్తంగా అభిమానులు ఎంతో ఘనంగా జరుపుకున్నారు.ఈ క్రమంలోనే ఓచోట అభిమానులు ఏర్పాటు చేసిన కార్యక్రమానికి జానీ మాస్టర్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.ఈ కార్యక్రమంలో భాగంగా ఈయన జానీ మాస్టర్ పై కాస్త ప్రేమను ఎక్కువగానే చూపించారు.

ఈ సందర్భంగా జానీ మాస్టర్ మాట్లాడుతూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిగా( AP Deputy CM ) ఉన్నారు.

Advertisement

ఇక 2029వ సంవత్సరంలో జరగబోయే ఎన్నికలలో ఆయన తప్పకుండా సీఎం అవుతారని ఆ తరువాత వచ్చే ఎన్నికలలో తప్పకుండా ప్రధానమంత్రి( Prime Minister ) అవుతారని.కచ్చితంగా ఇదే జరుగుతోంది రాసి పెట్టుకోండి జై జనసేన అంటూ ఈయన పవన్ కళ్యాణ్ పై తనకున్నటువంటి ప్రేమను తెలియజేస్తూ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇక ఈ కామెంట్లపై తెలుగుదేశం నాయకులు కాస్త మండిపడుతున్నారు.2029లో పవన్ కళ్యాణ్ సీఎం అయితే మా బాబు గారు ఏం కావాలి అంటూ కామెంట్లు చేయగా మరికొందరు సీఎం వరకు ఓకే కాని పిఎం అంటే కాస్త ఓవర్ గాని అనిపించలేదు అంటూ మరి కొంతమంది యాంటీ ఫ్యాన్స్ ఈయన వ్యాఖ్యలపై కామెంట్లు చేస్తున్నారు.

స్టూడెంట్‌ను అద్దె ఇంటి నుంచి వెళ్లగొట్టిన కంపెనీ.. భారీ ఫైన్ విధించిన కోర్టు..
Advertisement

తాజా వార్తలు