ఒడిశా రాష్ట్రంలోని పూరీలో ఉన్న జగన్నాథ ఆలయం ( Jagannath Temple )భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రాలలో ఒకటి.
ప్రతి సంవత్సరం లక్షలాది మంది భక్తులు జగన్నాథుడి రథయాత్రలో పాల్గొంటారు.
పాకిస్తాన్లోని వందలాది మంది హిందువులు కూడా జగన్నాథ యాత్రను జరుపుకోవడానికి గుమిగూడినట్లు ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.జగన్నాథుడిని విష్ణువు అవతారంగా భావిస్తారు.
రథయాత్ర సమయంలో జగన్నాథ్, అతని సోదరుడు బలభద్ర, సోదరి సుభద్రలను పూజిస్తారు.ఈ సంబరానికి లక్షల మంది భక్తులు హాజరవుతారు.
ఇకపోతే ప్రస్తుతం వైరల్ గా మారిన ఈ వీడియోలో, భక్తుల గుంపుగా శ్లోకాలు పాడటం, పువ్వులతో అలంకరించిన రథాన్ని లాగడం కనిపిస్తుంది.పాకిస్తాన్( Pakistan ) హిందువులు చేపట్టిన జగన్నాథ రథయాత్రలో ప్రజలు పాకిస్తాన్ జెండాలను ఎగురవేయడం కూడా గమినించవచ్చు.ముస్లింలు అధికంగా ఉన్న ఈ దేశంలో పాకిస్తాన్ హిందువులు కూడా రథయాత్రను నిర్వహించగలరనే వాస్తవం పట్ల సోషల్ మీడియా నెటిజన్స్ ఆశర్యం వ్యక్తం చేస్తున్నారు.
ఆషాఢ చంద్ర మాసం( Ashada Masam )లోని శుక్ల పక్షంలో, పూరి రథ యాత్రను చేపడతారు.ఇది పురాతన, అతిపెద్ద హిందూ పండుగగా పరిగణించబడుతుంది.ఇది ప్రతి సంవత్సరం పూరీలో జరుగుతుంది.
ఈ రథయాత్ర జగన్నాథుడికి అంగరంగా వైభవంగా జరుగుతుంది.రథయాత్ర సమయంలో జగన్నాధుడిని, అతని సోదరుడు బలభద్ర, సోదరి సుభద్ర విగ్రహాలను మూడు భారీ రథాలలో గుండిచా ఆలయానికి తీసుకువెళతారు.
అక్కడ వారు ఒక వారం పాటు ఉండి జగన్నాథ ఆలయానికి తిరిగి వస్తారు.ఇంకెందుకు ఆలస్యం పాకిస్థాన్ లో జరిగిన శోభనమీయమైన రథ యాత్రకు సంబంధించిన వీడియోను మీరు కూడా ఒకసారి వీక్షించి తరించండి.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy