థాంక్యూ సీఎం సార్... జగన్ సర్కార్ సాయానికి ఎమోషనల్ అయిన పంచ్ ప్రసాద్!

జబర్దస్త్ కమెడియన్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి పంచ్ ప్రసాద్ (Punch Prasad) ఆరోగ్య పరిస్థితి విషమంగా మారుతున్న విషయం మనకు తెలిసిందే.

ఈయనకు రెండు కిడ్నీలు పాడవడంతో డయాలసిస్ చేయించుకుంటూ వచ్చారు అయితే ప్రస్తుతం తనకు సర్జరీ అవసరమైందని వెంటనే సర్జరీ చేయాలి అంటూ డాక్టర్లు తెలియజేయడంతో సర్జరీ కోసం తగినంత డబ్బు లేకపోవడంతో దాతల సహాయం కోసం ఎదురుచూశారు.

ఈ క్రమంలోనే పలువురు జబర్దస్త్ కమెడియన్లు ఈయనకు సహాయం చేయడమే కాకుండా సహాయం చేయాలనుకున్నవారు ఫోన్ పే నెంబర్ ద్వారా సహాయం చేయొచ్చు అంటూ కొన్ని డీటెయిల్స్ కూడా సోషల్ మీడియాలో షేర్ చేశారు.

ఇలా ఈయన ఆరోగ్య పరిస్థితి గురించి జబర్దస్త్ మాజీ జడ్జ్ మంత్రి రోజా(Minister Roja) సీఎం జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy)దృష్టికి తీసుకువెళ్లారు.అయితే సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి ఆయనకు సర్జరీకి అవసరమయ్యే నిధులు మంజూరు అయ్యేలా చేశారు.దీంతో త్వరలోనే పంచ్ ప్రసాద్ కి సర్జరీ జరగనుందని తెలుస్తుంది.

ఈ విధంగా తన సర్జరీ కోసం ఏపీ ప్రభుత్వం ముందుకు రావడంతో పంచ్ ప్రసాద్ సీఎం జగన్మోహన్ రెడ్డికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒక వీడియోని షేర్ చేశారు.ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Advertisement

ఈ సందర్భంగా పంచ్ ప్రసాద్ మాట్లాడుతూ.సీఎం జగన్ సార్ కు ముందుగా కృతజ్ఞతలు మీ సాయం ఎప్పుడు మర్చిపోలేను.నా ఆరోగ్య సమస్యలు మంత్రి రోజా గారు సీఎం జగన్ దృష్టికి తీసుకు వెళ్లడంతో సీఎం రిలీఫ్ ఫండ్ నుంచినా చికిత్సకు అవసరమైన డబ్బులు విడుదలయ్యాయి త్వరలోనే సర్జరీ జరగబోతుందని మీరు చేసిన సహాయం మరువలేను అంటూ ఈయన ఎమోషనల్ అవ్వడమే కాకుండా థాంక్యూ సీఎం(Thank You Cm Sir) సార్ అంటూ జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ షేర్ చేసిన వీడియో వైరల్ గా మారింది.

పంచ్ ప్రసాద్ కి త్వరలోనే కిడ్నీ ట్రాన్స్ ప్లాంటేషన్ కూడా జరగబోతుందని తిరిగి ఈయన మామూలు మనిషి అవుతారు అంటూ అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు