పాకిస్తాన్ చేతిలో ఓటమిపాలైన భారత్..!!

అంతర్జాతీయ క్రికెట్ రంగంలో భారత్ వర్సెస్ పాకిస్తాన్( Pakistan ) మ్యాచ్ అంటే ఆ రెండు దేశాలు మాత్రమే కాదు యావత్ ప్రపంచం చూసే పరిస్థితి ఉంటుంది.

ఆ రీతిగా పోటాపోటీగా రెండు దేశాలకు చెందిన ఆటగాళ్లు ఆడుతుంటారు.

నరాలు తెగిపోయే రీతిలో ఉత్కంఠ భరితంగా.మ్యాచ్ లు జరుగుతుంటాయి.

ఈ రీతిగానే ఏసీసీ ఎమర్జింగ్ ఆసియా కప్ ఫైనల్( ACC emerging Asia cup) టోర్నీలో పాకిస్తాన్ వర్సెస్ భారత్ టీమ్స్ తలపడ్డాయి.అయితే ఫైనల్ మ్యాచ్ లో పాకిస్తాన్ చేతిలో భారత్ ఘోరంగా ఓటమిపాలైంది.

128 పరుగుల తేడాతో పాకిస్తాన్ చేతిలో భారత్( India ) చిత్తుచిత్తుగా ఓడిపోయింది.353 పరుగుల భారీ టార్గెట్ తో రెండో బ్యాటింగ్ కి దిగిన భారత్ 224 పరుగులకే ఆల్ అవుట్ అయిపోయింది.ఓపెనర్స్ బాగా రాణించిన గాని మిగతా బ్యాట్స్ మ్యాన్ లు అంతగా రాణించలేకపోయారు.

Advertisement

ఎవరు కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలదొక్కుకోలేకపోయారు.పాక్ బౌలర్లు చెలరేగిపోయారు.

భారత్ బ్యాట్స్ మ్యాన్ లను ముప్పు తిప్పలు పెట్టారు.పాక్ బౌలర్ లలో ముఖీమ్ మూడు వికెట్లు పడగొట్టడం జరిగింది.

Advertisement

తాజా వార్తలు