బరువు తగ్గాలంటే ఈ పిండితో చపాతీలు తినండి..!

ప్రస్తుత జీవనశైలి అనేక అనారోగ్య సమస్యలను కలిగిస్తుంది.అందులో ముఖ్యంగా అధిక ఉబకాయం, మధుమేహం( Diabetes ) వంటివి ప్రజల్ని వెంటాడుతూ ఉన్నాయి.

అయితే వీటన్నిటికీ ఒక రకంగా ఒత్తిడి, అధిక బరువే కారణంగా ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.ఈ భయం కారణంగా చాలా వరకు ఎక్కువ మంది ముందుగానే బరువును అదుపులో ఉంచుకునే ప్రయత్నం చేస్తున్నారు.

అయితే బరువు తగ్గాలనుకునే వారు ఆహారంలో కొన్ని మార్పులు చేసుకోవడం ద్వారా ఆశ్చర్యకరమైన ఫలితాలను చూడవచ్చు.సాధారణంగా బరువు తగ్గాలనుకునే వారు అన్నం తినకుండా చపాతీ తినడం మొదలుపెట్టారు.

అయితే చపాతీ ( Chapati )బరువు తగ్గడంలో ఉపయోగపడుతుంది.అయితే బరువు తగ్గేందుకు చపాతి తినే వారు గోధుమపిండితో చేసే చపాతి తింటే ఆశించిన ఫలితాలు రాకపోవచ్చు.

Advertisement

ఎందుకంటే గోధుమపిండిలో కార్బోహైడ్రేట్లు, ఎక్కువ కేలరీలు ఉంటాయి.అయితే ఏ పిండి చపాతి తినాలి ఏ పిండి చపాతి సులభంగా బరువు తగ్గిస్తుందో ఇప్పుడు తెలుసుకుందాం.

ముఖ్యంగా చెప్పాలంటే బియ్యం, మైదా, గోధుమలతో పోలిస్తే మిల్లెట్ బయటీ చర్మంలో పాలీపెనాల్స్ అధిక సాంద్రతలో కనిపిస్తాయి.రాగుల్లో ప్రోటీన్ కంటెంట్ ను బియ్యంతో పోల్చి చూస్తే రాగుల్లోని ప్రోటీన్ కంటెంట్ బియ్యం కంటే రెండింతలు ఉంటాయి.మిల్లెట్ పిండిలో ఫైబర్ అమైనో ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి.

ఇది తేలికగా జీర్ణం అవుతుంది.రాగుల పిండి( Ragi Pindi Chapati )లో గ్లూటెన్ ఉండదు.

ఊబకాయానికి మాత్రమే కాకుండా మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా ఈ పిండి ఎంతో ఉపయోగపడుతుంది.

నిర్మాతల కోసం పెద్ద మనసు చాటుకున్న చిరంజీవి.. ఇంద్ర రీరిలీజ్ వెనుక ఇంత జరిగిందా?
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం - నవంబర్ 20 శుక్రవారం, 2020

అలాగే ఓట్స్( Oats ) బరువు తగ్గడానికి మీకు ఎంతగానో ఉపయోగపడతాయి.అంతేకాకుండా రక్తంలో చక్కెర స్థాయిని కూడా అదుపులో ఉంచుతాయి.ఉదయాన్నే ఓట్ మీల్ తినడం వల్ల మన శరీర ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.

Advertisement

మీ ఆహారంలో ఓట్స్ చేర్చుకోవడం వల్ల మీ ఆరోగ్యం మెరుగుపరచుకోవచ్చు.బియ్యం, గోధుమపిండి, వలే క్వినోవా పిండిని కూడా ఇప్పుడు చాలా మంది తమ ఆహారంలో ఉపయోగిస్తున్నారు.

క్వినోవా పిండిలో పోషకాలు, ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి.ఇది అనారోగ్య కేలరీలను వదిలించుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది.

ఇది మన బరువును తగ్గించడంలో ఎంతో ఉపయోగపడుతుంది.

తాజా వార్తలు