ఈ సంకేతాలు కనిపిస్తే.. మీ పూర్వీకులు మీపై కోపంగా ఉన్నట్టే..!

కొత్త సంవత్సరంలో మొదటి అమావాస్య( Amavasya ) జనవరి 11 తేదీన గురువారం నాడు వస్తోంది.

ఆ రోజున పౌష అమావాస్య స్నానము, దానము చేయడం వలన పుణ్యఫలాలు లభిస్తాయి.

కొత్త సంవత్సరంలో మీ పురోగతిని ప్రభావితం చేసే కొన్ని సంకేతాలు మీకు వస్తాయి.కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి.

మీ పూర్వీకులు కోపంగా ఉన్నారని, దాని కారణంగా వారు అడ్డంకులు సూచిస్తున్నారని కొన్ని సంకేతాలు సూచిస్తాయి.పూరీలోని కేంద్రీయ సంస్కృత విశ్వవిద్యాలయ జ్యోతిష్యుడు డాక్టర్ గణేష్ మిశ్రా( Ganesh Mishra ) శ్రాద్ధం చేయనప్పుడు, వారికి దానాలు, తర్పణం మొదలైనవి చేయనప్పుడు వారు సంతృప్తి చెందలేరు.

అది వారి ఆగ్రహానికి కారణం అవుతుంది.దీని వలన పితృ దోషం వస్తుంది.

Advertisement
If You See These Signs.. Then Your Ancestors Are Angry With You , Amavasya , Ga

ఇక కోపంతో ఉన్న పూర్వీకుల సంకేతాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.

If You See These Signs.. Then Your Ancestors Are Angry With You , Amavasya , Ga

అలాగే అమావాస్యనాడు పూర్వీకులను ఎలా ప్రసన్నం చేసుకోవాలో కూడా తెలుసుకుందాం.పూర్వికులు( Ancestors ) కోపంగా ఉన్నప్పుడు వివాహానికి ఆటంకాలు ఎదురవుతారు.ఇక మీరు ఏదైనా పని చేయబోతుంటే అందులో పదేపదే అడ్డంకులు వస్తూ ఉంటాయి.

ఎన్ని ప్రయత్నాలు చేసినా పలు పనులు పూర్తికావు.దీంతో విజయం సాధించడం ఉండదు.

ప్రజల నుండి కూడా సహకారం అందదు.ఇది పూర్వికులు అసంతృప్తి వల్ల కావచ్చు.

శ‌రీరంలో హిమోగ్లోబిన్ లెవ‌ల్స్ ను పెంచే పండ్లు ఇవే..!
సుప్రీం కోర్టు పార్కింగ్‌లో లగ్జరీ కార్లు.. లాయర్ల రేంజ్ చూస్తే దిమ్మతిరగాల్సిందే!

ఇక మీ కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు పెరగడం మొదలవుతుంది.ఇక చిన్న చిన్న విషయాలకే ప్రతిరోజు వివాదాలు పెరుగుతూ ఉంటాయి.

Advertisement

ఇంట్లో అనైక్యత ఏర్పడి సభ్యుల మధ్య అపన్నమ్మకం కూడా పెరగవచ్చు.

ఇక సంతానం కలగకుండా, మీ వంశాన్ని పెంచుకోవాలనే కోరిక నెరవేరేకపోతే అది కూడా మీ పూర్వీకుల సంతృప్తికి సంకేతం.పూర్వీకులకు కోపం వస్తే వంశం ఎదుగుదలకు అడ్డంకులు సృష్టిస్తారని చెబుతారు.ఇక పితృ దోషం కారణంగా కుటుంబ సభ్యులు అనారోగ్యంతో ఉంటారు.

ఇక ఒక వ్యక్తి కోలుకున్నప్పుడు మరొకరు అనారోగ్యానికి గురవుతారు.లేదా ఒకే వ్యక్తి చాలా కాలం పాటు అనారోగ్యంతో ఉంటారు.

అమావాస్య లేదా పితృపక్షంలో కొన్ని చర్యలు తీసుకోవాలి.అమావాస్య రోజున స్నానమాచరించి పూర్వీకులకు కుశ, జల నైవేద్యాలు సమర్పించాలి.

ఇలా చేయడం వలన పూర్వీకులు సంతోషిస్తారు.ఇక కుశలు లేకుండా తర్పణం సమర్పించడం వలన వారికి తృప్తి కలగదని అంటారు.

అలాగే పూర్వీకులను ప్రసన్నం చేయడానికి పంచవలి కృతువులు, దానాలు చేయాలి.

తాజా వార్తలు