చిత్తూరు జిల్లాలో భారీ అగ్నిప్ర‌మాదం

చిత్తూరు జిల్లాలో భారీ అగ్నిప్ర‌మాదం జ‌రిగింది.రంగాచారి వీధిలో పేప‌ర్ పేట్ల ప‌రిశ్ర‌మ‌లో మంట‌లు చెల‌రేగాయి.

ఒక్క‌సారిగా మంట‌లు ఎగ‌సిప‌డ్డాయి.స‌మాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని మంట‌ల‌ను అదుపులోకి తెచ్చారు.

అయితే ఈ ప్ర‌మాదంలో మంట‌ల్లో చిక్కుకుని ముగ్గురు స‌జీవ ద‌హ‌నం అయిన‌ట్లుగా తెలుస్తోంది.మృతులు భాస్క‌ర్, ఢిల్లీ బాబు, బాలాజీగా గుర్తించారు.

ప్ర‌మాదానికి షార్ట్ ష‌ర్య్కూటే కార‌ణ‌మ‌ని పోలీసులు భావిస్తున్నారు.

Advertisement
ఆయన మరణ వార్త చదువుతూ ఏడ్చేసిన యాంకర్..

తాజా వార్తలు