పరభాషా నుండి వచ్చిన సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటున్న హీరోయిన్స్

టాలీవుడ్ అంతా ప‌ర భాష హీరోయిన్ల‌తో నిండిపోయింది.

మీకు తెలుగు వ‌చ్చా అని అడిగితే చాలా మంది న‌టీ మ‌ణులు కొంచెం కొంచెం వ‌చ్చు అని చెప్తారు.

ఏది మాట్లాడండి అంటే.అంద‌రికీ న‌మ‌స్కారం అంటారు.

ఇక్క‌డి హీరోయిన్లు కాక‌పోవ‌డం వ‌ల్ల వారికి తెలుగు కష్టం అనిపిస్తుంది.వాళ్లు చేసిన పాత్ర‌కు వేరొక‌రు డ‌బ్బింగ్ చెప్పాల్సి ఉంటుంది.

కానీ కొన్నిసార్లు తెలుగు హీరోయిన్లు కాక‌పోయినా.త‌మ రోల్స్ కి తామే డ‌బ్బింగ్ చెప్పుకుంటున్నారు కొందరు నటీమణులు.

Advertisement

ఇప్ప‌టి వ‌ర‌కు అలా డ‌బ్బింగ్ చెప్పిన వారెవ‌రో.ఆ సినిమాలు ఏంటో ఇప్పుడు చూద్దాం.

పూజా హెగ్డే

ఎన్టీఆర్ హీరోగా వ‌చ్చిన సినిమా అర‌వింద స‌మేత వీర రాఘవ‌.ఈ సినిమాలో హీరోయిన్ గా చేసిన పూజా హెగ్డే త‌న పాత్ర‌కు తానే డ‌బ్బింగ్ చెప్పింది.

స‌మంతా

మ‌హాన‌టి సినిమాలో జ‌ర్న‌లిస్టు పాత్ర పోషించిన సమంతా త‌న పాత్ర‌కు తానే డబ్బింగ్ చెప్పుకుంది.

కీర్తి సురేష్

అజ్ఞాత‌వాసి, మ‌హాన‌టి సినిమాల్లో త‌న క్యారెక్ట‌ర్ కు సొంత గొంతుతో డ‌బ్బింగ్ చెప్పింది కీర్తి.

ర‌కుల్ ప్రీత్ సింగ్

ఏంటి భయ్యా.. స్వీట్ షాప్ కు స్వీట్స్ కొనడానికి వచ్చాయా ఏంటి ఎలుకలు(వీడియో)
జగన్ తప్పు తెలుసుకున్నారా ? ప్రక్షాళన కు సిద్ధమా ? 

జూనియ‌ర్ ఎన్టీఆర్ హీరోగా తెర‌కెక్కిన నాన్న‌కు ప్రేమ‌తో సినిమాలో ర‌కుల్ ప్రీత్ సింగ్ సొంతంగా డ‌బ్బింగ్ చెప్పుకుంది.

రశ్మిక మందాన

Advertisement

చలో సినిమాలో తన క్యారెక్టర్ కు తాను స్వయంగా వాయిస్ ఇచ్చింది రశ్మిక.

తాప్సీ

ప్రభాస్ హీరోగా వచ్చిన మిస్టర్ ఫర్ఫెక్ట్ సినిమాలో తనకు తానే డబ్బింగ్ చెప్పుకుంది.

సాయి పల్లవి

వరుణ్ తేజ్ హీరోగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో సాయి పల్లవి సొంతంగా డబ్బింగ్ చెప్పింది.

నయనతార

రానా హీరోగా వచ్చిన క్రుష్ణం వందే జగద్గురుం సినిమాలో నయనతార తన రోల్ కు తానే డబ్బింగ్ ఇచ్చింది.

అనుపమ పరమేశ్వర్

నితిన్ హీరోగా వచ్చిన అఆ సినిమాలో తానే డబ్బింగ్ చెప్పుకుంది.

అదితి రావు హైదరి

సమ్మోహన్ సినిమాలో అదితి డబ్బింగ్ చెప్పింది.

నిత్యా మీనన్

చలో సినిమాలో తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకుంది నిత్య.

తమన్నా

నాగార్జున, కార్తి నటించిన ఊపిరి సినిమాలో తమన్నా తన క్యారెక్టర్ కు తానే డబ్బింగ్ చెప్పుకుంది.

తాజా వార్తలు