ఈ ఎండలేంట్రా బాబోయ్ .. ! 

రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు తీవ్రంగా మండిపోతున్నాయి.బయట కాలు పెట్టాలంటే జనాలు హడలిపోయే పరిస్థితి కనిపిస్తోంది .

గత వందేళ్ళలో ఎప్పుడు లేని విధంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతూ ఉండడం ఆందోళన కలిగిస్తోంది .46 డిగ్రీల ఉష్ణోగ్రతలు( Temperatures of 46 degrees ) వరకు నమోదు అవుతుండడంతో ప్రజలు బయటకు వచ్చేందుకు హడలిపోతున్నారు.ఇళ్లల్లో ఉన్నా.

ఎండ వేడి కారణంగా ఆపసోపాలు పడుతున్నారు .నిప్పుల కుంపట్లో కూర్చున్నట్లుగానే పరిస్థితి ఉంది .ఉదయం 6 గంటల నుంచి ఉక్క పోత మొదలవడంతో జనాలు అల్లాడిపోతున్నారు.మే నెల మొదట్లోనే ఈ విధంగా ఉండడంతో,  వచ్చే రోహిణి కార్తి ( Rohini Karti )నాటికి పరిస్థితి ఇంకెంత దారుణంగా ఉంటుందో అనే ఆందోళన జనాల్లో కనిపిస్తోంది.

గతంలో ఇంత స్థాయిలో ఎండలు ఎప్పుడు జనాలు చూడలేదు.  ఉదయం నుంచే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటోంది .రోడ్లన్నీ నిర్మాణస్యంగా మారుతున్నాయి .

అత్యవసర పనులు ఉంటే తప్ప , జనాలు బయటకు రావడం లేదు.ఇక అత్యవసర పనులు ఉంటే తప్ప జనాలు బయటకు రావద్దంటూ వైద్యులు కూడా సూచిస్తూ ఉండడంతో ఇళ్లకే పరిమితం అవుతున్నారు .పొలం పనులు ఉన్నా.ఉదయం , సాయంత్రం వేళల్లోనే చేసుకుంటూ మధ్యాహ్నం విశ్రాంతికే జనాలు ప్రాధాన్యం ఇస్తున్నారు .తెలంగాణలో( Telangana ) ఇప్పటికే 15 జిల్లాల్లో రెడ్ అలర్ట్ ను వాతావరణ శాఖ ప్రకటించింది.

Advertisement

మరో 18 జిల్లాల్లో ఆరెంజ్ అలర్ట్( Orange Alert ) ను ప్రకటించారు.వృద్ధులు,  చిన్నపిల్లలు ఈ ఎండ తీవ్రత కారణంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు  ఇక ఏసీల వాడకం కూడా విపరీతంగా పెరిగింది.మరోవైపు ఎన్నికల సమయం కావడంతో ఈ ఎండల్లోనే రాజకీయ పార్టీల నాయకులు ప్రచారం నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది .ఆ సభలు,   సమావేశాలకు జనాలు తరలింపు చేపట్టడమూ కష్టతరంగానే మారింది.మరికొద్ది రోజుల పాటు ఎండ తీవ్రతలు ఇదేవిధంగా ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరికలతో జనాలు మరింత బెంబేలు చెందుతున్నారు.

మొదటి సినిమాతోనే రికార్డ్ లు బ్రేక్ చేయాలని చూస్తున్న స్టార్ హీరో కొడుకు..?
Advertisement

తాజా వార్తలు