ప్రభుత్వ పాఠశాలలు ప్రగతికి సోపానాలు

రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం పోతుగల్ గ్రామం అంబేద్కర్ నగర్ లోని ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులతో కలిసి స్థానిక సర్పంచ్ తన్నీరు గౌతంరావు,తెలంగాణ రాష్ట్ర రజక సంఘం అధ్యక్షులు అక్కరాజు శ్రీనివాస్ మధ్యాహ్న భోజనం చేశారు.

తదుపరి విద్యార్థుల సమస్యలు, పాఠశాలకు సంబంధించినటువంటి సమస్యలు అక్కరాజు శ్రీనివాస్ పాఠశాల ఉపాధ్యాయులను అడిగి తెలుసుకున్నారు.

పాఠశాల పాత భవనం కూల్చి వేత

ఈ సందర్భంగా గౌతంరావు, అక్కరాజు శ్రీనివాస్ మాట్లాడుతూ గత 35 సంవత్సరాల క్రితం నిర్మించిన పాఠశాల భవనం పూర్తిగా శిథిలావస్థకు చేరి విద్యార్థులకు ప్రమాదకరంగా మారడంతో మంత్రి కేటీఆర్ చోరువతో నూతన భవన నిర్మాణానికి సిఎస్ఆర్ నిధులతో మంజూరు చేయడం జరిగిందని,శుక్రవారం రోజు పాత భవనాన్ని కూల్చి వేసి నూతన భవనం నిర్మించడం జరుగుతుందని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కొండని బాలకిషన్,గూడెం ఉపసర్పంచ్ శ్రీనివాస్,వార్డు సభ్యులు అంజలి అనిల్, దేవరాజు, శ్రీనివాస్,అంజయ్య, తదితరులు పాల్గొన్నారు.

పూరీ జగన్నాథ్ సినిమాలకు గుడ్ బై చెప్పాలంటూ కామెంట్స్.. అనుమానమే అంటూ?

Latest Rajanna Sircilla News