భ‌ద్రాచలం వ‌ద్ద మ‌ళ్లీ పెరుగుతున్న గోదావ‌రి

గోదావ‌రి న‌ది ఉగ్ర‌రూపాన్ని దాల్చుతోంది.ఎగువ నుంచి వ‌స్తున్న వ‌ర‌ద కార‌ణంగా భ‌ద్రాచ‌లం వ‌ద్ద నీటిమ‌ట్టం క్ర‌మంగా పెరుగుతోంది.

భ‌ద్రాచలం వ‌ద్ద ప్ర‌స్తుతం నీటిమ‌ట్టం 50.8 అడుగుల‌కు చేరింది.గ‌త మూడు రోజులుగా 2 అడుగుల మేర త‌గ్గిన వ‌ర‌ద ప్ర‌వాహం మ‌ళ్లీ పెరుగుతోంది.

దీంతో అప్ర‌మ‌త్త‌మైన అధికారులు ముంపు ప్రాంతాల ప్ర‌జ‌లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని సూచించారు.ఇటీవ‌ల వ‌చ్చిన భారీ వ‌ర్షాలు, వ‌ర‌ద‌ల‌తో భ‌ద్రాచలం స‌హా ప‌రిస‌ర ప్రాంతాలు అత‌లాకుత‌లం అయిన సంగ‌తి తెలిసిందే.

ఈ క్ర‌మంలో మ‌ళ్లీ గోదావ‌రి నీటిమ‌ట్టం పెరుగుతుండ‌టంతో ప్ర‌జ‌లు తీవ్ర ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు.

వాడిన కాఫీ పొడిని మ‌ళ్లీ ఇలా కూడా వాడొచ్చు.. తెలుసా?
Advertisement