ఉదయం ఖాళీ కడుపుతో ఈ ఆహార పదార్థాలను తింటున్నారా? అయితే ఇది మీకోసమే..!

మీ మానసిక స్థితి మీరు రోజు ఉదయం తినే ఆహారం( Mornign Food ) పై ఆధారపడి ఉంటుంది.

అందువల్ల ఉదయం ఆరోగ్యకరమైన అల్పాహారంతో మీ రోజును మొదలుపెట్టడం ఎంతో ముఖ్యం.

పోషకాలు, కార్బోహైడ్రేట్లు, కొవ్వులు, చక్కెర అధికంగా ఉండే ఆహారం తీసుకోవడం వల్ల మీ శక్తి స్థాయిలు తగ్గుతాయి.ఇది మధుమేహం ఉన్నవారిలో రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది.

అలాగే రక్తపోటును కూడా పెంచుతుంది.అందుకే ఉదయం పూట సరైన మోతాదులో ప్రోటీన్లు, విటమిన్లు, పీచు పదార్థాలు, క్యాల్షియం ఉన్న ఆహారం తీసుకోవడం ఎంతో అవసరం.

ముఖ్యంగా చెప్పాలంటే ఈ ఆహారాలను ఉదయం పూట తినకపోవడమే మంచిది.ఉదయం సమయంలో కాఫీ తాగడం( Coffee ) వల్ల కార్టిసాల్ లెవెల్స్ పెరిగే అవకాశం ఉంది.ఎందుకంటే ఉదయాన్నే హార్మోన్ ఎక్కువగా ఉంటుంది.

Advertisement

కాఫీ వినియోగం కార్టిసాల్ ను మరింత పెంచుతుంది.అలాగే హార్మోన్ల పై ప్రభావం పడుతుంది.

ఇది బీపీని పెంచుతుంది.మీకు కాఫీ అలవాటు ఉంటే ఖాళీ కడుపుతో కాకుండా అల్పాహారం తర్వాత తాగడం మంచిది.

కొంతమంది ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఆహారంగా పండ్ల రసన్ని తాగుతారు.అయితే పండ్ల రసాలలో( Fruit Juices ) ఫైబర్ ఎక్కువగా ఉండదు.

అందుకే దీన్ని ఉదయాన్నే తీసుకోవడం వల్ల రక్తంలో చక్కెర స్థాయి పెరుగుతుంది.

రాజాసాబ్ సినిమా వచ్చేది అప్పుడేనా..?మారుతి ఎందుకంత స్లో గా వర్క్ చేస్తున్నాడు...
సింప్లిసిటీకి పర్‌ఫెక్ట్‌ ఎగ్జాంపుల్‌ ప్రభాస్‌.. వైరల్ అవుతున్న శిరీష్ ఆసక్తికర వ్యాఖ్యలు!

అందువల్ల జ్యూస్ కు బదులుగా పండ్లను తీసుకోవచ్చు.నిమ్మరసం( Lemon Juice ), దోసకాయ రసం కలిపిన నీటిని ఖాళీ కడుపుతో సేవించవచ్చు.ఆకలిని నియంత్రించుకోవడానికి కొందరు ఉదయాన్నే పాన్ కేకులు తింటారు.

Advertisement

దీన్ని ఖాళీ కడుపుతో తింటే రోజంతా ఏదో ఒకటి తినాలి అనిపిస్తూ ఉంటుంది.అలాగే దాహం పెరుగుతుంది.

ఉదయం నిద్ర లేచిన వెంటనే టీ తాగడం వల్ల కాఫీ లాగా మేలు కంటే ఎక్కువ హాని కలుగుతుంది.ఉదయం ఖాళీ కడుపుతో ఎక్కువ మొత్తంలో చక్కెర, కెఫీన్, నికోటిన్ తీసుకోవడం అసలు మంచిది కాదు.

ఇది ఎసిడిటీ, గుండెల్లో మంట, రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది.కాబట్టి ఎంత వీలైతే అంత వీటికి దూరంగా ఉండటమే మంచిది.

తాజా వార్తలు