వచ్చే వారంలో టీ-బీజేపీ అభ్యర్థుల మొదటి జాబితా

తెలంగాణ బీజేపీ అభ్యర్థుల మొదటి జాబితా వచ్చే వారంలో విడుదల కానుందని రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు.

ఢిల్లీకి వెళ్లిన కిషన్ రెడ్డి కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో భేటీ అయిన సంగతి తెలిసిందే.

ఈ సమావేశంలో ప్రధానంగా తెలంగాణ రాజకీయ పరిస్థితులు, ఎన్నికల ప్రచారంపై నేతలు చర్చించారు.తెలంగాణకు గిరిజన వర్సిటీతో పాటు పసుపు బోర్డును ప్రధాని ప్రకటించారన్నారు.

రేపు నిజామాబాద్ బహిరంగ సభలో మోదీ ప్రసంగిస్తారని తెలిపారు.గతంలో ఎన్నడూ లేని విధంగా పాలమూరు బీజేపీ సభ జరిగిందన్నారు.

అదేవిధంగా ఈనెల 10వ తేదీన తెలంగాణకు అమిత్ షా వస్తారని తెలిపారు.అక్టోబర్ 5 మరియు 6 వ తేదీల్లో రాష్ట్రస్థాయి బీజేపీ సమావేశాలు జరుగుతాయని వెల్లడించారు.

Advertisement

ఈ క్రమంలోనే రానున్న ఎన్నికలపై జేపీ నడ్డా దిశానిర్దేశం చేస్తారని తెలిపారు.

చైనా: యూట్యూబర్‌కు షాకింగ్ అనుభవం.. మంటలు షూట్ చేసిన రోబో డాగ్‌..?
Advertisement

తాజా వార్తలు