Varsha Priyadarshini FIR : ఉద్యోగం ఇప్పిస్తానని మహిళను మోసం చేసిన స్టార్ హీరోయిన్.. ఇంత ఘోరమా?

కేటుగాళ్ళు ఎప్పుడెప్పుడు అమాయకమైన ప్రజలను మోసం చేద్దామా,వారిని మోసం చేసి వారి దగ్గర డబ్బులు లాగేద్దామా ప్రయత్నిస్తూ ఉంటారు.

అయితే ప్రజలను నమ్మించి ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసి వారి దగ్గర నుంచి డబ్బులు లాగుతూ ఉంటారు.

చివరికి డబ్బులు చేతికి అందిన తర్వాత కనిపించకుండా మాయం అవుతూ ఉంటారు.నిత్యం ఇలాంటి ఘటనలు వెలుగులోకి వస్తున్నప్పటికీ అటువంటి వారిలో మాత్రం మార్పు రావడం లేదు.

అయితే ఆ పరిశ్రమ ఈ పరిశ్రమ అని తేడా లేకుండా అన్ని పరిశ్రమలలో ఈ విధంగా మోసం చేసే వాళ్ళు ఉన్నారు.సినీ పరిశ్రమలో ఒక సినీ హీరోయిన్ ఉద్యోగం పేరుతో ఒక మహిళను మోసం చేసిందని ఆరోపించడం మాత్రమే కాకుండా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో పోలీసులు సదరు హీరోయిన్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.బంగారు ఆభరణాల దుకాణంలో ఉద్యోగం ఇప్పిస్తానని ఒక మహిళ దగ్గర రూ.30 వేలు తీసుకుని మోసం చేసినట్లు మహిళా ఆరోపణలు చేసింది.ఒడిశా ఇండస్ట్రీకి చెందిన వర్ష ప్రియదర్శిని పలు సినిమాల్లో హీరోయిన్ గా నటించింది.

జోర్, గోల్మాల్, లవ్ స్టోరీ, రోమియో జూలియట్ లాంటి సినిమాలలో హీరోయిన్ గా నటించింది.ఒడియాలోనే కాకుండా బెంగాలీ సినిమాల్లో కూడా హీరోయిన్ గా నటించింది.కాగా ప్రియదర్శిని ఒడిశాకి చెందిన ఎంపీ అనుభవ్ మహంతి భార్య అన్న విషయం తెలిసిందే.

Advertisement

సినిమా అలాగే రాజకీయ నేపథ్యం ఉన్న ఈమెపై ఒక మహిళను ఉద్యోగం పేరుతో తనని మోసం చేసిందన్న ఆరోపణలు వస్తున్నాయి.ఒక మహిళకు జ్యువలరీ షాప్ లో ఉద్యోగం ఇప్పిస్తానని ఆమె అసోసియేట్ ప్రియదర్శిని, ఆయుషి ఇద్దరూ కలిసి రూ.30 వేలు అడిగారని, ఆ డబ్బు చేతికి అందాక అందుబాటులో లేరని కళ్యాణి నాయక్ వెల్లడించారు.ఈ మేరకు హీరోయిన్ వర్ష ప్రియదర్శిని, ఆమె అసోసియేట్ ఆయుషి పై భువనేశ్వర్ లోని షాహీద్ నగర్ పోలీస్ స్టేషన్ లో చీటింగ్ కేసు నమోదు చేశారు.ఎఫ్ఐఆర్ కాపీ కూడా ఫైల్ చేశారు.

ప్రస్తుతం పోలీసులు ఈ కేసుని విచారిస్తున్నారు.అయితే దీనిపై ఇప్పటివరకూ హీరోయిన్ వర్ష ప్రియదర్శిని స్పందించలేదు.

మరి ప్రియదర్శిని ఏ విధంగా స్పందిస్తుందో చూడాలి మరి.

సూర్య కంగువ సినిమా మీద ఫోకస్ చేసిన అమీర్ ఖాన్...కారణం ఏంటంటే..?

Advertisement

తాజా వార్తలు