తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం .. నలుగురు మృతి

తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం( road accident ) జరిగింది.అదుపుతప్పిన ఓ కారు ప్రమాదవశాత్తు డివైడర్ ను ఢీకొట్టింది.

ఈ ప్రమాదంలో నలుగురు మృత్యువాత పడ్డారు.మరో ఇద్దరికి తీవ్రగాయాలు అయ్యాయి.

వెంటనే గమనించిన స్థానికులు బాధితులను హుటాహుటిన చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు.కాగా చంద్రగిరి మండలం ఎం.కొంగరవారిపల్లిలో ఘటన చోటు చేసుకుంది.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.

అనంతరం ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

Advertisement
Kirol Bet Bonuses And Promotions : A Value Assessment For Experienced Players