కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం..నలుగురు మృతి

కాకినాడ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం సంభవించింది.ట్రాలీని టాటా మ్యాజిక్ వాహనం వెనుక నుంచి ఢీ కొట్టింది.

ఈ ఘటన గండేపల్లి మండలం మల్లేపల్లి దగ్గర చోటు చేసుకుంది.ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు.

మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.వెంటనే స్పందించిన స్థానికులు బాధితులను రాజమండ్రి ఆస్పత్రికి తరలించారు.

ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Advertisement
God Of Coins Player Safety And Responsible Gambling (UK)